Andhra Pradesh : ఏపీకీ చేరుకున్న 20 పారామిలిటరీ బలగాలు
ఆంధ్రప్రదేశ్కు శనివారం 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకోన్నాయి. ఆదివారం మరికొన్ని పారామిలిటరీ బలగాలు వచ్చే ఛాన్స్ ఉంది. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్కు శనివారం 20 కంపెనీల పారామిలిటరీ బలగాలు చేరుకోన్నాయి. ఆదివారం మరికొన్ని పారామిలిటరీ బలగాలు వచ్చే ఛాన్స్ ఉంది. కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
ఏపీ లో ఎన్నికల సమయంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ సంఘటనల గురించి ఎలక్షన్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కడప జిల్లా జమ్మలమడుగులో మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల కదలికలపై ఫోకస్ పెట్టారు.
ఈ-ఆఫీస్ అప్గ్రేడ్పై ఎన్ఐసీ ప్రతినిధులతో ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా మాట్లాడారు. విపక్షాల అభ్యంతరాలతో ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఎన్ఐసీకి సూచించారు.
ఎన్నికల వేళ ఏపీలో కొనసాగుతున్న అల్లర్లపై ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని, రెండు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఏపీలో ఎన్నికల వేళ కొనసాగుతున్న అల్లర్లపై ఈసీ సీరియస్ అయింది. ఘర్షణలను కంట్రోల్ చేయడంలో విఫలమైన పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి డీఎస్పీలపై బదిలీ వేటు వేసింది. వీరిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది.
దేశంలో నాలుగు దశల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా భారత ఎన్నికల సంఘం నాలుగు దశల్లో 66.95 శాతం ఓటింగ్ నమోదైందని వెల్లడించింది. మొదటి నాలుగు దశల్లో సుమారు 451 మిలియన్ల మంది ఓటు వేసినట్లు తెలిపింది.
తెలంగాణలో 10 యూనివర్సిటీలోకు కొత్త వైస్ ఛాన్స్లర్ల (VC) నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ.. ఈ నెలాఖరులోగా కొత్త వీసీలను ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేసి.. నియామక ఉత్తర్వులు జారీ చేయనుంది.
మహబూబ్నగర్ జిల్లాలో బాలానగర్ వద్ద ఓ లారీలో భారీగా మద్యం పట్టుబడింది. ఆ మద్యం బాటిళ్ల విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆ లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు.
పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియ పై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ఏజెంట్ల నియామకం లిస్టును రిటర్నింగ్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ఈసీ తెలిపింది. పోలింగ్ రోజున ప్రిసైడింగ్ అధికారికి పోలింగ్ ఏజెంట్ తమ వివరాలు సమర్పిస్తే చాలని ఈసీ వివరించింది.