Telangana: మణికొండ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు
హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్లో మొత్తం 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. డీజే నిర్వాహకుడు ఆయూబ్తో సహా మరో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు తేలినట్లు గుర్తించారు. డ్రగ్స్ తీసుకున్నవారిలో ఎక్కువమంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొన్నారు.