బదిరుల పాఠశాలలో ఘోరం.. విద్యార్థికి నిప్పంటించిన స్నేహితులు
తిరుపతి టీటీడీ బదిరుల పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. చందు అనే పిల్లవాడిపై తోటి విద్యార్థులు కెమికల్ ఆయిల్ పోసి నిప్పంటించారు. 80 శాతం గాయాలైన చందును ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.