కవిత ఇంకోసారి పవన్ గురించి మాట్లాడితే. ! | Dharmapuri Arvind Satirical Comments On MLC Kavitha | RTV
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను ఢిల్లీలోని ఆయన నివాసంలో ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మందకృష్ణకు అర్వింద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వర్గీకరణ అంశంపై వీరు చర్చించారు.
TG: సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ భేటీ అయ్యారు. ఈ నెల 7న దివంగత నేత డి. శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను ఆహ్వానించారు.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్, మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్లను దాఖలు చేశారు. అర్వింద్ తనకు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొనగా.. తనకు 21.07 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు తెలిపారు రఘునందన్రావు.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కవిత అరెస్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ తన గుండుకు పచ్చబోట్లు పొడిపించి, గాడిదపై ఊరేగిస్తాననే వ్యాఖ్యలపై ఆర్టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో తనదైన స్టైల్ లో విరుచుకుపడ్డారు.
నిజామాబాద్ ఎంపీగా నియంత అరవింద్ వద్దంటూ జగిత్యాల న్యూస్ పేపర్లలో దర్శనమిచ్చిన పాంప్లెట్లపై ధర్మపురి అరవింద్ స్పందించారు. ఆ కరపత్రాలు పంచింది ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అని ఆరోపించారు. జీవన్ రెడ్డి అంకుల్ ఇవేమి పనులంటూ వీడియో విడుదల చేశారు.
ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టార్గెట్ గా శేరిలింగంపల్లి బీజేపీ నేత యోగానంద్ సంచలన వాఖ్యలు చేశారు. తనను ఇబ్బందులకు గురి చేస్తే కోరుట్ల అసెంబ్లీ, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో వేలు పెడతానని హెచ్చరించారు.