Delhi Elections Results 2025 LIVE : మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో బీజేపీ | BJP vs AAP | Kejriwal | Modi
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్పర్గంజ్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి గెలుపోదారు. ఆప్ అభ్యర్థి అవధ్ ఓజాను ఆయన 23 వేల 280 ఓట్ల తేడాతో ఓడించారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ ఈయన పాదాలకు నమస్కరించారు.
కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి సీఎం అతిషిపై 3,231 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సీఎం అతిషిపై గెలిచాక కేబినెట్ లో రమేష్ బిధూరికి కేబినెట్ లో హోమ్ మినిస్టర్ పదవి దక్కే అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ ఇమేజ్ ను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పారు అన్నా హజారే . ఆప్ కు తక్కువ ఓట్లు రావడానికి ఈ కుంభకోణమే కారణమని అన్నారు. రాజకీయాల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రవర్తన స్వచ్ఛంగా ఉండాలని.. ఇదే విషయాన్ని చేబితే కేజ్రీవాల్ వినలేదన్నారు.
దశాబ్దం పాటు అధికారంలో ఉన్న ఆప్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడటానికి గల కారణాలు ఏమిటి అనేది ఇపుడు పెద్ద ప్రశ్నలుగా మారాయి. క్లీన్ ఇమేజ్ కలిగి ఉన్న కేజ్రీవాల్.. అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం నుండి రాజకీయాల్లోకి వచ్చారు.
ల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం అతిషి ఓటమి దిశగా పయనిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ఆమె కంటే 2800 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. న్యూఢిల్లీ స్థానానికి 13 రౌండ్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటివరకు ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయింది.
బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో ఆప్ అభ్యర్థులకు గాలం వేస్తోందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఈ ఆరోపణలపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా విచారణకు ఆదేశించారు.
బీజేపీ 16 మంది ఆప్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఆప్.. 70 మంది పార్టీ అభ్యర్థులకు కేజ్రీవాల్ నివాసంలో శుక్రవారం భేటీ కావాలని పిలుపునిచ్చింది. బీజేపీ ప్రలోభాలకు లొంగకుండా ఉండాలని ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం