కాలుష్యం అంచుల్లో ఢిల్లీ.. ఆప్ సర్కార్ కీలక నిర్ణయం!
కాలుష్య స్థాయి పెరగడంతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వాహనాలకు సరి-బేసి సంఖ్య విధానాన్ని మరోసారి అమలు చేయనున్నారు.
కాలుష్య స్థాయి పెరగడంతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వాహనాలకు సరి-బేసి సంఖ్య విధానాన్ని మరోసారి అమలు చేయనున్నారు.
ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు కాల్చడాన్ని ఆయా ప్రభుత్వాలు నిషేధించాయి. పంజాబ్లో పంట వర్థాలు కాల్చడాన్ని అడ్డుకునేందుకు వెళ్లిన ఓ అధికారిని అక్కడి రైతులు బలవంతగా ఓ కుప్పకు మంట పెట్టించడం చర్చనీయాంశమైంది.
ఢిల్లీలో వరుసగా ముడో రోజు వాయు కాలుష్యం తీవ్రస్థాయిలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి లేఖ రాశారు. సీఎన్జీ, విద్యుత్తు, బీఎస్ 4 వాహనాలకు మాత్రమే రోడ్లపై అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ కొన్నిరోజులుగా విషగాలి గుప్పెట్లో చిక్కుకుంది. దీంతో బంగ్లాదేశ్, శ్రీలంక క్రికెటర్లు తమ ప్రాక్టిస్ సెషన్ను రద్దు చేసుకున్నారు. నవంబర్ 6న అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరగనుంది. సెమీస్ రెస్లో నిలవాలంటే ఈ మ్యాచ్ శ్రీలంకకు ఎంతో కీలకం.