Sabarimala: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్.. అయ్యప్ప దర్శనానికి ఇకపై కొత్త రూల్
శబరిమల అయ్యప్ప స్వామి దర్శన మార్గంలో ట్రావెన్కోర్ దేవస్థానం కొన్ని మార్పులు చేసింది. ఎక్కువ సమయం అయ్యప్పను దర్శించుకోవడం కోసం కొత్త మార్గాన్ని అమలు చేయనుంది. మార్చి 15వ తేదీ నుంచి ప్రారంభించే ఈ రూట్ ద్వారా ఎక్కువ నిమిషాలు స్వామిని దర్శించుకోవచ్చు.