Telangana Election: ఓటు వజ్రాయుధం..మన తల రాతను మార్చేది అదే: కేసీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారం, బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్ ఎన్నికల పర్యటనలో భాగంగా కోరుట్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని సీఎం ప్రసంగించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారం, బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం కేసీఆర్ ఎన్నికల పర్యటనలో భాగంగా కోరుట్లలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని సీఎం ప్రసంగించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ అవినీతి కారణంగానే నేడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే స్థితికి చేరిందన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్ట్స్ కేంద్రానికి ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి కాసానిని పార్టీలోకి ఆహ్వానించారు. కాసానితో పాటు భారీ స్థాయిలో ఆయన అనుచరులు కూడా బీఆర్ఎస్ లో చేరారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల గురించి గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు నెటీజన్లు. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలు, అభ్యర్థుల గురించి కూడా ఎక్కువగా శోధిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనపై తెలంగాణ సీఎం కేసీఆర్ వేసిన సెటైర్లపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు.
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. కేసీఆర్ను ఓడించేందుకే కాంగ్రెస్లో చేరానని స్పష్టత ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వంపై మరో సారి సెటైర్లు విసిరారు సీఎం కేసీఆర్. డబుల్ రోడ్డు వస్తే తెలంగాణ-సింగిల్ రోడ్డు వస్తే ఏపీ అంటూ ఈ రోజు సత్తుపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇల్లందులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. డబ్బు మదంతో విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించి, పరిణతితో వేయాలని సూచించారు సీఎం కేసీఆర్.
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీజేపీ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్గా ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్తో బీఆర్ఎస్ కుమ్మక్కైందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.