కెనడా-భారత్ వ్యాఖ్యల మీద అమెరికా స్పందన
ఖలీస్థానీ విషయంలో భారత్, కెనడాల మధ్య వివాదం ముదురుతోంది. దీని మీద అగ్రదేశం అమెరికా స్పందించింది. ట్రూడో ఆరోపణల మీద ఆందోళన వ్యక్తం చేసింది.
ఖలీస్థానీ విషయంలో భారత్, కెనడాల మధ్య వివాదం ముదురుతోంది. దీని మీద అగ్రదేశం అమెరికా స్పందించింది. ట్రూడో ఆరోపణల మీద ఆందోళన వ్యక్తం చేసింది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య అంశంపై కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. తీవ్రవాద శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారు హర్దీప్ సింగ్ ను కెనడాలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అయితే దీంట్లో భారత్ ప్రమేయం ఉందని కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని ప్రకటించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది.
ఖలిస్థానీ ఉగ్రవాది , మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో భారత్కు కెనడా గట్టి ఝలక్ ఇచ్చింది. హర్దీప్ సింగ్ నిజ్జార్ కు ఉన్న సంబంధాన్ని తాము విచారిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. కాగా హర్దీప్ సింగ్ ను కెనడాలో కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జార్ పై ఇప్పటికే ఎన్ఐఏ కేసులు కూడా నమోదు చేసింది. అయితే హర్దీప్ సింగ్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
జీ-20 సదస్సుకోసం భారత వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో భారత్ కు తిరిగి వచ్చింది. ప్రధాని జస్టిన్ టూడ్ జి 20 సదస్సు అనంతరం ఢిల్లీ నుంచి బయలుదేరేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కెనడాలో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రే టౌన్ లోని ప్రముఖ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు కూల్చి వేశారు. ఇక కెనడాలో ఆలయంపై దాడి జరగడం ఇది నాలగవ సారి. ఈ ఏడాది ఏప్రిల్ లో ఒంటారియాలోని స్వామి నారాయణ్ ఆలయంపై దాడి జరిగింది. అంతకు ముందు ఫిబ్రవరిలో కెనడాలోని రామ మందిర్, జనవరిలో బ్రాంప్టన్ ఆలయంపై ఖలీస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేశారు.
కెనడాలో భారతీయ విద్యార్థి గుర్విందర్ నాథ్ జూలై 14న దుండగుల దాడిలో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పంజాబ్ కు చెందిన గుర్విందర్ నాథ్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తన స్వగ్రామానికి తరలించారు. అప్పటి వరకు తన కొడుకు మరణవార్త ఆ తల్లికి తెలియదు. చివరి నిమిషంలో తెలియడంతో...తట్టుకోలేని ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.