canada issue:కెనడియన్లకు భారతీయ వీసాలు నిలిపివేత...
కెనడా-భారత్ ల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోందే తప్ప ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా భారత్-కెనడా దేశాల మధ్య వీసా ఆపరేషన్స్ ను నిలిపేస్తున్నామని భారత్ ప్రకటించింది.
కెనడా-భారత్ ల మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోందే తప్ప ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. తాజాగా భారత్-కెనడా దేశాల మధ్య వీసా ఆపరేషన్స్ ను నిలిపేస్తున్నామని భారత్ ప్రకటించింది.
ఖలిస్తానీ ఉద్యమంలో కీలకమైన మరో గ్యాంగ్ స్టర్ కెనడాలో హత్య గురైనట్లు సమాచారం. ప్రత్యర్ధుల దాడిలో ఇతను మరణించాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన అతను పంజాబ్ కు చెందిన సుఖా దునెకే గా గుర్తించారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను భారత్ హతమార్చిందని కెనడా ఆరోపిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ విషం చిమ్మింది. భారత్ను విమర్శించే సాకుతో పాక్ పీఓకే, బాలాకోట్లలో సర్జికల్ స్ట్రైక్స్ గురించి తెరపైకి తెచ్చింది. కెనడా ఆరోపణలకు పాకిస్థాన్ మద్దతు తెలిపింది.
కెనడాతో వివాదంలో తొలిసారిగా బద్ధ శత్రువైన చైనా భారత్కు అండగా నిలిచింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్పై జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను పాశ్చాత్య కూటమి ఎజెండాగా చైనా అభివర్ణించింది. భారత్ను సద్వినియోగం చేసుకునేందుకు ఇది ఒత్తిడి వ్యూహంగా అభివర్ణించారు. అటు కెనడాతో సహా పాశ్చాత్య దేశాలై గ్లోబల్ టైమ్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కెనడా- భారత్ల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కెనడాలో ఉన్న భారతీయులు, భారత్కు చెందిన విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కెనడా భారత్తో సత్సంబంధాలను చెడగొట్టుకుంది. ఖలిస్థాన్ ఉగ్రవాదిని హతమార్చడం వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపిస్తోంది. అలాంటి ఆరోపణలను భారత్ ఖండించింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడ్డాయి. ఇండియా పరువు తీసేందుకు కెనడా చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ అగ్రదేశాలైన అమెరికా, బ్రిటన్ కెనడాకు సపోర్టు చేయలేదు. భారత్ విషయంలో కెనడా వైఖరి తప్పని చెప్పకనే చెప్పాయి. భారత్ పరువు తీయాలనుకున్న కెనడా తన పరువు తానే తీసుకున్నట్లయ్యింది.
ఖలీస్థానీ విషయంలో భారత్, కెనడాల మధ్య వివాదం ముదురుతోంది. దీని మీద అగ్రదేశం అమెరికా స్పందించింది. ట్రూడో ఆరోపణల మీద ఆందోళన వ్యక్తం చేసింది.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య అంశంపై కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. తీవ్రవాద శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారు హర్దీప్ సింగ్ ను కెనడాలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అయితే దీంట్లో భారత్ ప్రమేయం ఉందని కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని ప్రకటించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది.
ఖలిస్థానీ ఉగ్రవాది , మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య కేసులో భారత్కు కెనడా గట్టి ఝలక్ ఇచ్చింది. హర్దీప్ సింగ్ నిజ్జార్ కు ఉన్న సంబంధాన్ని తాము విచారిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. కాగా హర్దీప్ సింగ్ ను కెనడాలో కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జార్ పై ఇప్పటికే ఎన్ఐఏ కేసులు కూడా నమోదు చేసింది. అయితే హర్దీప్ సింగ్ హత్యలో భారత్ హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.