KCR: బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం..కరీంనగర్ లో 12న భారీ బహిరంగ సభ..!
బీఆర్ఎస్ లోకసభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించింది. ఎన్నికల నేపథ్యంలో ఈనెల 12 కరీంనగర్ లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.