BJP : బీజేపీ రాజ్యసభాపక్ష నేతగా నడ్డా!
బీజేపీ రాజ్యసభాపక్ష నేతగా జేపీ నడ్డాను ప్రకటింనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పేరును అనౌన్స్ చేస్తారని సమాచారం. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆయనే అధ్యక్షుడుగా ఉంటారు.
బీజేపీ రాజ్యసభాపక్ష నేతగా జేపీ నడ్డాను ప్రకటింనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పేరును అనౌన్స్ చేస్తారని సమాచారం. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆయనే అధ్యక్షుడుగా ఉంటారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిపై బీజేపీలో వివాదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్కు ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరిగినప్పటికీ తాజాగా రాజాసింగ్ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
బీజేపీ హైకమాండ్ తో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి టచ్ లోకి వెళ్లారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓకే అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తప్పా.. అందరూ చేరేందుకు సిద్ధమన్నారు. అయితే.. తమ పార్టీ వారిని చేర్చుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు.
బీజేపీ అధికారంలోకి రాగానే..భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ .అమ్మవారి దయవల్లే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసే వరకు పోరాడతామని బండి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో కళ్లకురిచి అనే జిల్లాలో కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు. మరో 10 మంది ఆసుపత్రిపాలయ్యారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కల్తీ మద్యం ఎక్కడినుంచి వచ్చిందనే దానిపై విచారణ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
TG: కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్లో అడుగుపెట్టారు బండి సంజయ్. కరీంనగర్ గడ్డకు కమాన్ వద్ద ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం చేయడంతో బీజేపీ శ్రేణుల కేరింతలు కొట్టారు.
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో జరగనుండగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కిరణ్ చౌదరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. కిరణ్ చౌదరి బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది.
నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జిలను బీజేపీ హైకమాండ్ నియమించింది. J&K ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, ఎన్నికల సహ ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్, హరియాణాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లబ్ కుమార్దేవ్ పేర్లను ప్రకటించింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం మరో కీలక బాధ్యతలు అప్పగించింది. మరో రెండు నెలల్లో జమ్మూకశ్మీర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఇంఛార్జిగా కిషన్ రెడ్డిని నియమించింది. మరిన్ని రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమిస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.