RBI: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ షాక్.. నగదు విత్ డ్రాపై ఆంక్షలు.. వివరాలివే!
అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కలర్ మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్పై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ కస్టమర్లు ఇకపై వారి అకౌంట్ నుంచి రూ. 50 వేలకు మించి డబ్బులు విత్డ్రా చేసుకోవడం కుదరదని ఆర్బీఐ చెప్పింది. బ్యాంక్ ఆర్థిక స్థితి ఆశాజకనంగా లేకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చామని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.