Badrachalam:ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముస్తాబైన భద్రాద్రి!
భద్రాచలం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ముస్తాబు అయ్యింది. నేటి నుంచి జనవరి 2 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. డిసెంబర్ 23 వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారు జాము నుంచి ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు.