ఆర్టీసీ విలీనం బిల్లుకు తెలంగాణ గవర్నర్ ఆమోదం
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదం తెలిపారు. ఈ బిల్లుతో 43,055 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్నారు.
ఈనెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 21 నుంచి అయిదు రోజుల పాటూ సమావేశాలు జరగనున్నాయి.
DK Aruna: స్పీకర్ తన కాల్ను లిఫ్ట్ చేయడం లేదు
హైకోర్టు ఆర్డర్ కాపీతో డీకే అరుణ అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో హైకోర్టు ఆర్డర్ కాపీని ఆమె అసెంబ్లీ సిబ్బందికి ఇచ్చినట్లు తెలిపారు. స్పీకర్ వెంటనే హైకోర్టు ఆర్డర్ కాపీని ఇంప్లిమెంట్ చేయాలని డీకే అరుణ కోరారు.
టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. సమావేశాలు నిరవధిక వాయిదా
టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఇవాళ సాయంత్రం ఆర్టీసీ బిల్లుపై చర్చ జరిపిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దీంతో గత రెండు రోజులగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లైంది.
దేశం ఆశ్చర్యపోయేలా చేస్తాం: సీఎం కేసీఆర్
విపక్షాలకు సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పరిస్థితి, తెలంగాణ పరిస్థితి ఎలాగుందో చూసుకోవాలన్నారు. ప్రగతిలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ దరిదాపుల్లో లేవని స్పష్టం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేసిన ఎమ్మెల్యే సీతక్క
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఎమ్మెల్యే సీతక్క బాయ్ కాట్ చేశారు. సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో.. నిరసన వ్యక్తం చేస్తూ సీతక్క బాయ్ కాట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. జీరో అవర్ లో కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తమ సమస్యలు అసెంబ్లీలో మాట్లాడాలని అంటున్నా.. అవకాశం ఇవ్వకపోతే మరి అసెంబ్లీలో ఎలా మాట్లాడతారని కేసీఆర్ ప్రభుత్వాన్ని..