Chandrababu : కేంద్రంలో చక్రం తిప్పేది చంద్రబాబే.. తేడా వస్తే ఎన్డీయేకు ఇబ్బందే!
కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మరోసారి కీ రోల్ ప్లే చేయనున్నారు. ఆయన ఎన్డీయేలో రెండో అతిపెద్ద భాగస్వామిగా నిలవనున్నారు.
కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మరోసారి కీ రోల్ ప్లే చేయనున్నారు. ఆయన ఎన్డీయేలో రెండో అతిపెద్ద భాగస్వామిగా నిలవనున్నారు.
AP: ప్రభుత్వం ఏర్పాటు దిశగా టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. నేతలు, అధికారులతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. నాలుగో సారి ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు.
ఏపీలో లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇండియా టూడే - మై యాక్సిస్ సంస్థలు వెల్లడించాయి. వైసీపీకి కేవలం 2 నుంచి 4 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇక టీడీపీకి 13 నుంచి 15 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 6 స్థానాలు, జనసేన 2 స్థానాల్లో గెలుస్తుందని తమ సర్వేలో వెల్లడించాయి.
పిఠాపురంలో స్టిక్కర్ల సంస్కృతిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పిఠాపురం, ఉప్పాడ, కొత్తపల్లిలో పిఠాపురం MLA తాలుకా స్టిక్కర్లు ఉన్న వాహనాలను పట్టుకుంటున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులిపర్తి నానిని చంపే ఉద్దేశం తనకు లేదని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పులివర్తి నాని పట్ల తనకు రాజకీయ విభేదాలు మాత్రమే ఉన్నాయని, వ్యక్తిగతంగా ఎలాంటి కక్ష సాధింపు లేదని స్పష్టం చేశారు.
ఎన్నికలు సజావుగా జరిగేందుకే పలువురు అధికారులను ఈసీ మార్చిందని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అన్నారు. అధికారులను అడ్డు పెట్టుకుని టీడీపీ పోలింగ్ నిర్వహించిందని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఎంపీ ఆయన సీరియస్ అయ్యారు. అలా అని నిరూపించగలరా? అని ఫైర్ అయ్యారు.
ఏపీలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి నేడు విదేశాలకు వెళ్లనున్నారు. జూన్ 1 వరకు ఆయన లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ లో పర్యటించనున్నారు. దీంతో విపక్షాలు వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీ ఆందోళన పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాలు విడుదల అయిన 15 రోజుల వరకూ కేంద్రబలగాలను రాష్ట్రంలోనే కొనసాగించాలని ఆదేశించింది. అవసరమైతే మరిన్ని బలగాలనూ వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్రహోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నానన్నారు సినీ నటుడు నరేశ్. తాను ఊహించినట్లుగానే ఏపీలో అధికార మార్పిడికి ముందు రక్తపాతం జరిగిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.