రేవంత్..ఈరోజు నీ టైం నడుస్తుంది.. | Allu Aravind Reaction On Allu Arjun House Attack Issue | RTV
అల్లు అర్జున్ వివాదంపై సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఏకధాటిగా దాడి చేస్తున్న నేపథ్యంలో బన్నీని వదిలేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి చెడ్డపేరు వస్తుందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సంధ్య థియేటర్ ఘటనపై సినీయర్ హీరోయిన్, కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పిన ఆమె..రాజకీయ స్వార్థం కోసం ఈ ఘటనను ఉపయోగించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
అవసరమైతే విదేశాల నుండి వైద్యులను రప్పించి శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందిస్తామని కాంగ్రెస్ నాయకురాలు కాల్వ సుజాత ప్రకటించారు. హాస్పిటల్ ఖర్చులన్నీ ఇప్పటివరకూ ప్రభుత్వమే భరించిందని తెలిపారు. అల్లు అర్జున్ వెంటనే ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలన్నారు.
అల్లు అర్జున్పై ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 'అర్థరాత్రి పబ్బుల్లో, గోవాలో పార్టీలు చేసుకునే నీ కంటే సోనూ సూద్ నయం. సమంత, మంచులక్ష్మి ఎంతో ఆదర్శంగా ఉంటారు. తమిళ నటులకున్న సామాజిక సృహ మీకు ఎందుకు లేదు' అంటూ మండిపడ్డారు.