బాపు, అమ్మ ఆరోగ్యం జాగ్రత్త..ఫోన్లో అఘోరీ కన్నీళ్లు | Lady Aghori Emotional Comments | Sri Varshini
అఘోరీ, శ్రీవర్షిణీపై యూట్యూబర్ అన్వేష్ సంచలన కామెంట్స్ చేశాడు. ‘‘శ్రీనివాస్ (అఘోరీ) ముల్లులేని మగాడు. పక్కా ప్లాన్తో వచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాటకం ఆడుతున్నాడు. వర్షిణీ కూడా అతడి వద్ద ఉన్న డబ్బును ఎంజాయ్ చేయడానికి వెళ్లిపోయింది’’ అని చెప్పుకొచ్చాడు.
అఘోరీ తన చెల్లిపై చేతబడి చేసిందని వర్షిణీ అన్నయ్య హర్ష ఆరోపణలు చేశాడు. అఘోరీ రాకముందు తన చెల్లి బాగానే ఉందని అన్నాడు. అఘోరీ ఎప్పుడైతే తమ ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి తన చెల్లి మారిపోయిందని.. ఫ్యామిలీ వద్దు అఘోరీయే ముద్దు అనడానికి కారణమేంటని ప్రశ్నించాడు.
లేడీ అఘోరీ, శ్రీవర్షిణి పరారీలో ఉన్నారు. వారి ఫోన్లు నిన్నటి నుంచి స్విచ్చాఫ్ వస్తున్నాయి. అఘోరీపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. దీంతో వారిని అరెస్టు చేస్తారనే భయంతో పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా షామీర్పేటలో మరో కేసు ఫైల్ అయింది.
లేడీ అఘోరీగా తిరుగుతున్న శ్రీనివాస్, శ్రీవర్షిణిలు ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తరువాత ఈ జంట ఆర్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. హనీమూన్ కు ఎక్కడికి వెళ్తున్నారంటే.. హనీమూన్ అంటూ ఏమీలేదని.. కొన్ని ఆలయాలకు వెళ్తామని శ్రీవర్షిణి చెప్పుకొచ్చింది.
లేడీ అఘోరీ మరోమోసం బయటపడింది. యోని పూజ పేరుతో రూ.10లక్షలు దోచేసినట్లు ఓ మహిళా నిర్మాత మొకిలా పీఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో అఘోరీపై 308(5), 318(1),351(4),352 BNS సెక్షన్లకింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అఘోరీ మొదటి భార్య శ్రీవర్షిణికి సవాల్ విసిరింది. ‘‘నేను వర్షిణి అంత గలీజ్ దాన్ని కాదు. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా నేను కూడా వచ్చి పోరాడుతానని వర్షిణి చెప్పింది. వర్షిణి నిజంగా ఆడపిల్లే అయితే అఘోరీని తీసుకొచ్చి నాకు అప్పగించాలి.’’ అని సవాల్ విసిరింది.
అఘోరీ తన మొదటి భార్యతో గతంలో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ‘రాధీ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. మిస్ యు లవ్ యు. నావల్ల కావట్లేదు. హార్ట్లో పెయిన్గా ఉంది. మనిద్దరం జీవితాంతం కలిసి మెలిసి ఒకే ఇంట్లో ఉండాలనేది నా కోరిక’ అంటూ అఘోరీ చెప్పడం వినవచ్చు.