General Elections 2024: లోక్సభ ఐదో దశ ఎన్నికలకు ముగిసిన ప్రచారం.. రేపే పోలింగ్
లోక్ సభ ఎన్నికల పర్వం ఐదో దశకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఐదో దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో మే 20న పోలింగ్ జరుగుతుంది. రాహుల్ గాంధీతో సహా పలువురు ప్రముఖులు ఈ దశలో పోటీ పడుతున్నారు.