భారీ బందోబస్తు మధ్య గ్రూప్-1 మెయిన్స్.. యాక్షన్ లోకి 144 సెక్షన్!
తెలంగాణలో రేపటినుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనుండగా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు 46 పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. టీజీపీఎస్సీ కంట్రోల్ రూమ్ నుంచి లైవ్ లో పరీక్షలను పర్యవేక్షించనున్నారు.