Gayatri Joshi Accident: బాలీవుడ్ నటి గాయత్రీ జోషి దంపతులకు తప్పిన పెను ప్రమాదం.. వైరల్ వీడియో!

బాలీవుడ్ నటి గాయత్రీ జోషి (Gayatri Joshi), ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ (Vikas Oberoi) ప్రయాణిస్తున్న కారుకు ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. సార్డీనియాలో జరిగిన లగ్జరీ కార్ల ప్రదర్శన పోటీ సందర్భంగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో వారు క్షేమంగా బయటపడ్డారు.

Gayatri Joshi Accident: బాలీవుడ్ నటి గాయత్రీ జోషి దంపతులకు తప్పిన పెను ప్రమాదం.. వైరల్ వీడియో!
New Update

బాలీవుడ్ నటి గాయత్రి జోషి (Gayatri Joshi), ఆమె భర్త వికాస్ ఒబెరాయ్ (Vikas Oberoi) ఘోర ప్రమాదం నుంచి తప్పుంచుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారు ఇటలీలో ఘోర ప్రమాదానికి గురైంది. సార్డీనియాలో జరిగిన లగ్జరీ కార్ల ప్రదర్శన పోటీ సందర్భంగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయత్రి జోషి, ఆమె భర్త ప్రాణాలతో బయటపడ్డారు. అయితే.. ఈ ప్రమాదం కారణంగా స్విట్జర్లాండ్ కు చెందిన ఓ జంట దుర్మరణం పొందారు. ఈ ప్రమాదంలో గాయత్రీ జోషి మరియు ఆమె భర్త వికాస్ ప్రయాణిస్తున్న ఫెర్రారీ కారు, లంబోర్గిని కార్లు ముందున్న క్యాంపర్ వ్యాన్ ను క్రాస్ చేయబోతుండగా ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి.

ఇది కూడా చదవండి: Viral Video: ఇలా చేస్తే ప్రాణాలు పోతాయ్.. షాకింగ్ వీడియోలు షేర్ చేసిన సజ్జనార్ ఐపీఎస్

ఈ ప్రమాదం తర్వాత ఫెరారీ కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న మెలీసా క్రౌటిల్ (63), మార్కస్ క్రౌటిల్ (67) అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయత్రీ జోషి, వికాస్ ఒబెరాయ్ ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా బయటపడ్డారని తెలుస్తోంది.

ఈ సందర్బంగా గాయత్రీ జోషీ కీలక ప్రకటన విడుదల చేసింది. వికాస్, తాను ఇటలీలో ఉన్నామని ప్రకటించింది. అక్కడ తాము ఓ ప్రమాదానికి గురయ్యామని వెల్లడించింది. అయితే.. దేవుడి దయతో తాము పూర్తి క్షేమంగా బయటపడ్డాని తెలిపింది గాయత్రీ జోషి. బాలీవుడ్ మూవీ ‘స్వదేశ్లో షారుఖ్ ఖాన్‌తో కలిసి గాయత్రీ జోషి నటించింది.

#bollywood #viral-video #accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe