Chandrababu : చంద్రబాబు కేసు విచారణ... చివరిలో ఊహించని ట్విస్ట్!

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగలేదు. జస్టిస్ త్రివేది మరో కోర్టులో బిజీగా ఉండడం వలన ఈ కేసును ఈ రోజు విచారించలేమని.. విచారణ తేదీని వెల్లడిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు.

Chandrababu : చంద్రబాబు కేసు విచారణ... చివరిలో ఊహించని ట్విస్ట్!
New Update

AP Fiber Net Case : ఫైబర్ నెట్ కేసు(Fiber Net Case) లో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఈ కేసులో గతంలో ముందస్తు బెయిల్ పై ఏపీ హైకోర్టు(AP High Court) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఈ పిటిషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే.. కొన్ని కారణాల వల్ల విచారణ జరగలేదు. జస్టిస్ త్రివేది మరో కోర్టులో బిజీగా ఉండడం వలన చంద్రబాబు కేసును ఈ రోజు విచారించలేమని తెలిపారు. విచారణ తేదీని వెల్లడిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు.

ALSO READ: BREAKING: సీఎం జగన్ తో RGV భేటీ

అసలేంటీ ఫైబర్ నెట్ కేసు..

టెర్రా సాఫ్ట్ కంపెనీ(Terra Soft Company) కి నిబంధనలకు విరుద్దంగా… కాంట్రాక్టు కట్టబెట్టారని ఆరోపణలు చేసింది. అప్పటికే టెర్రా సాఫ్ట్ కంపెనీ బ్లాక్‌ లిస్ట్‌లో ఉందని.. మొత్తం రూ.321 కోట్ల ప్రాజెక్టులో రూ.114. 53 మేర అవినీతి జరిగిందని తేల్చినట్లు సీఐడీ(CID) పిటిషన్‌లో పేర్కొంది. సెప్టెంబర్-2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. ఏ-1గా వేమూరి హరి ప్రసాద్, ఏ-2గా సాంబశివరావు పేర్లను చేర్చినట్లు తెలిపింది. ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీలను తక్కువ ధరకు అందించే నిమిత్తం ఫైబర్ నెట్ ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది.

ఫైబర్ నెట్ కుంభకోణంలో ఏ-25 నిందితుడిగా చంద్రబాబు పేరు చేరుస్తూ సీఐడీ మెమో(Memo) ధాఖలు చేసింది. ఫైబర్ నెట్ కేసులో వేసిన పీటీ వారెంట్‌కి అనుబంధంగా ఈ మెమో జతపర్చింది. సంబంధిత శాఖను తన వద్ద ఉన్నప్పుడే ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కుంభకోణం జరిగిందని సీఐడీ ఆరోపించింది. A-1 వేమూరి హరికృష్ణని టెండర్ ప్రాసెస్ కమిటీలో సభ్యుడిగా నియమించేలా అధికారులపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారనే అభియోగం మోపింది. మెస్సర్స్ పేస్ పవర్ అనే సంస్థ ఈ ప్రక్రియను తప్పు పట్టినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొంది. నాసిరకం మెటీరియల్, 80 శాతం ఫైబర్ కేబుల్ పనికి రాకుండా పోయిందని తెలిపింది. ఫేక్ ఇన్‌వాయిస్‌ల ద్వారా నిధుల మళ్లింపు జరిగిందని వెల్లడించింది. ఇప్పటికే స్కిల్ డెవల్‌ప్మెంట్‌తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంపైనా చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది.

Also Read : BIG BREAKING: హైదరాబాద్ లో తొలి ఉరిశిక్ష.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

DO WATCH:

#ap-fiber-net-case #chandrababu-bail #supreme-court #ap-latest-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe