Breaking : జగన్ సర్కార్‎కు సుప్రీం ఝలక్..!!

సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన వేర్వేరు పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పుంగనూరు అంగళ్లు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిసన పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల విషయంలో తాము కలగజేసుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది.

New Update
Supreme Court : నారీ శక్తి అంటూ గొంతులు చించుకుంటారు కదా.. ఇక్కడ చూపించండి మరి!

సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన వేర్వేరు పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పుంగనూరు అంగళ్లు కేసులో ప్రభుత్వం దాఖలు చేసిసన పిటిషన్ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అయితే గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల విషయంలో తాము కలగజేసుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది. అంగళ్లు కేసులో నిందితులకు బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీం ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఏంటని ప్రశ్నించింది.

కాగా రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ పై జస్టిస్‌ అనిరుద్ద బోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేది సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. పుంగనూరు అంగళ్లు ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. సామాన్యులకు భద్రత కల్పించాల్సిన పోలీసులే..సాక్షులుగా ఎఫ్ఐఆర్ ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు దారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పోలీసులే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులే సాక్షులుగా ఉంటారా అంటూ సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

ఇది కూడా చదవండి:  దేశంలో మళ్లీ మోదీదే హవా…తగ్గేదేలేదు..!!

అయితే హైకోర్టు బెయిల్‌ ఇచ్చింది కాబట్టి ఆ విషయంలో తాము జోక్యం చేసుకోడానికి ఏమీ లేదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేరు వేరు పిటషన్లను కూడా సుప్రీం కొట్టివేసింది.

ఇక అంగళ్లు ఘటనలో టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణ తర్వాత టీడీపీ నేతలకు బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏసీ సర్కార్ సుప్రీంకోర్టులో 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. తెలుగుదేశం నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి అలియాస్‌ చల్లా బాబు, నల్లారి కిషోర్‌ కుమర్‌ రెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్‌ రద్దు చేయాలని ఏపీ సర్కార్ ను కోరింది.

ఇది కూడా చదవండి: ఇంకెన్నాళ్ళు అబద్ధాలు చెబుతారు- ప్రధాని మోదీ మీద కేటీఆర్ సెటైర్లు

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Maoist : మావోయిస్టుల కుట్ర భగ్నం....జర్రయితే ప్రాణం పోతుండే.

ఒకవైపు ఎదురుకాల్పుల్లో అగ్రనాయకులను కోల్పోతున్న మావోయిస్టులు భద్రతా దళాలపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. మావోయిస్టులు అమర్చిన 10 మందుపాతరలను నిర్విర్వం చేశాయి.

New Update
Maoist Key Leader Hidma Arrested

Maoist

Maoist : ఒకవైపు ఎదురుకాల్పుల్లో అగ్రనాయకులను కోల్పోతున్న మావోయిస్టులు భద్రతా దళాలపై కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.అందులో భాగంగా తమ కోసం వచ్చే భద్రతాదళాలను మట్టుపెట్టడానికి బాంబులు పెడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. అడవి ప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు 10 మందుపాతరలను అమర్చారు. అయితే వాటిని గుర్తించిన  భద్రతా బలగాలు నిర్వీర్యం చేసి.. స్వాధీనం చేసుకున్నాయి. ఆదివారం ఉదయం కోహ్కమెట పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాంప్ కుతుల్ గ్రామం ఖోడ్పర్, గుర్మ్కా అటవీ రహదారిలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఆ క్రమంలో మందుపాతరలను గుర్తించినట్లు భద్రతాబలగాలు తెలిపాయి. కాగా ఈ ప్రాంతంలో ఐఈడీలను అమర్చడంతో దరిదాపుల్లోనే మావోయిస్టులు ఉండిఉంటారని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అందులో భాగంగా బీడీఎస్‌ బృందాలతో కలిసి ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి.

Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?

మరోవైపు వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రధానమంత్రి మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. మావోయిస్టులే లక్ష్యంగా కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీంతో ఇప్పటికే వివిధ ఎన్‌కౌంటర్లలో పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించారు. అలాగే వందలాది మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. మరికొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: జూన్ 2025లో భారీగా సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే

ఇక కేంద్రం ఇటీవల విడుదల చేసిన సమాచారాన్ని బట్టి  గతంలో కంటే మావోయిస్టుల హింస పూర్తిగా తగ్గిపోయింది. 2010లో మావోయిస్టుల హింసాత్మక సంఘటనలు 1936 ఉంటే అవి 2024 నాటికి 374కు తగ్గిపోయాయని తెలిపింది. అంటే దాదాపు 81 శాతం మేర మావోయిస్టుల హింస తగ్గిందని వివరించింది. అలాగే దేశంలో 2013లో మావోయిస్టుల ప్రభావిత జిల్లాలు 126గా ఉంటే.. అవి 2021 నాటికి 70.. ఇక ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నాటికి అవి 18కి పరిమితమైనట్లు వెల్లడించింది. మావోయిస్టుల హింసలో 2010 నాటికి 720 మంది పౌరులు మరణిస్తే.. 2019కి ఆ సంఖ 150కి చేరుకుంది అది ప్రస్తుత ఏడాది మాత్రం 19 మంది మరణించారని తెలిపింది. మావోయిస్టు అగ్రనాయకులు ఎన్‌కౌంటర్లలో మరణించడంతో మావోయిస్టు కార్యకలపాలు దాదాపు తగ్గుముఖం పట్టినట్లు కేంద్రం వెల్లడించింది.

 Also Read: ఏపీలో టీచర్ అరాచకం.. ముసలి వయసులో విద్యార్థినితో పాడు పని - వీడియో

 

Advertisment
Advertisment