ISRO: అంతరిక్షంలోకి వెళుతున్న రెండో భారతీయుడు శుభాంశు శుక్లా

అంతరిక్షంలోకి మరో భారతీయుడు వెళ్ళనున్నారు. రాకేశ్ శర్మ తర్వాత స్పేస్‌లోకి వెళ్ళనున్న రెండో వ్యక్తిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించనున్నారు. అమెరికాకు చెందిన ఆక్సియోమ్ స్పేస్ తో ఇస్రో చేసుకున్న ఒప్పందంలో భాగంగా శుక్లా స్పేస్‌లోకి వెళ్ళనున్నారు.

New Update
ISRO: అంతరిక్షంలోకి వెళుతున్న రెండో భారతీయుడు శుభాంశు శుక్లా

Second India In To Space: అంతరిక్షంలోకి ఇప్పటివరకు రాకేశ్ శర్మ అన్న భారతీయడు ఒక్కరే వెళ్ళారు. కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్ వెళ్ళినా వాళ్ళు ఇండియన్ ఆరిజీన్ అమెరికన్లుగా3 గుర్తింపు పొందినవారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక భారతీయుడు స్పేస్‌లోకి వెళ్ళబోతున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్‌) పంపనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇండో ‌‌–యూఎస్ మిషన్‌లో స్పేస్‌లోకి వెళుతున్న శుక్లాను ప్రధాన వ్యోమగామిగా ఎంపిక చేశారు. ఒకవేళ ఇతను ఏ కారణం చేత అయినా స్పేస్‌లోకి వెళ్ళేందుకు ఇబ్బందులు ఎదురైతే బ్యాకప్ వ్యోమగామిని కూడా ఎంపిక చేశారు.

అంతరిక్షంలోకి వెళుతున్న శుభాంశు శుక్లా అత్యంత పిన్న వయస్కుడు. అక్టోబర్ 10, 1985న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో శుక్లా జన్మించాడు.నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్న ఇతను జూన్ 17, 2006లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు. తర్వాత ఫైటర్ కంబాట్ లీడర్‌గా అపాయింట్ అయ్యారు.ఇతనికి మొత్తం 2000 ఫ్లైట్ అవర్స్ అనుభవం ఉంది. సుఖోయ్-30MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్ మరియు An-32 వంటి విమానాలను నడిపిన అనుభవం కూడా ఉంది.

ఇక బ్యాకప్ ఆస్ట్రోనాట్‌గా గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ను నియమించారు. ఇతను ఆగస్టు 26, 1976లో కేరళలోని తిరువాజియాడ్‌లో జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదివి, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో స్వోర్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. డిసెంబర్ 19, 1998లో ఐఎఎఫ్ ఫైటర్ స్ట్రీమ్‌లో నియమితులయ్యారు. ఇతనికి 3000 గంటల ఫ్లైట్ అనుభవం ఉంది.

1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత మరో భారతీయుడు నేరుగా వెళ్ళడం ఇదే మొదటిసారి. అన్ని అనుకున్నట్టు అయితే రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర లిఖించనున్నారు. ఇస్రొ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ (HSFC), అమెరికాకు చెందిన అక్సియోమ్ స్పేస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిలో Axiom-4 ద్వారా భారత వ్యోమగామిని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) పంపాలని అగ్రిమెంట్ చేసుకుంది. ఇందులో వెళ్ళేవారిని గగన్ యాత్రి అని పిలుస్తున్నారు. దీని కోసం ఇద్దరు అధికారుల శిక్షణ ఆగస్టు మొదటివారంలో ప్రారంభం అవుతుంది.

Axiom-4 మిషన్ సిబ్బందిలో యూఎస్ నుంచి పెగ్గీ విట్సన్ (కమాండర్), భారతదేశం నుంచి గ్రూప్ కెప్టెన్ శుక్లా (పైలట్), పోలాండ్‌కు చెందిన సావోస్జ్ ఉజ్నాన్స్కి (మిషన్ స్పెషలిస్ట్)ఇంకా హంగరీకి చెందిన టిబోర్ కాపు (మిషన్ స్పెషలిస్ట్) ఉన్నారు. స్పేస్‌లోకి పంపేందుకు గతేడాది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నుంచి నలుగురిని ఎంఇక చేసింది ఇస్రో. వారికి టెస్ట్ పైలట్ చేసింది. అందులో సెలెక్ట్ అయిన వారికి శిక్షణ ఇచ్చింది. వీరి ప్రాథమిక శిక్షణను గగన్‌యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీలో ప్రారంభించారు. గగన్ యాన్ మిషన్ ద్వారా భారత్ తన మానవ సహిత అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాలని ప్రదర్శించనుంది.

Also Read : ‘ఒక్కసారి కమిట్‌ అయితే లిమిటే లేదు’.. బిగ్ బాస్ సీజన్-8 టీజర్ చూశారా?

Advertisment
తాజా కథనాలు