Yashasvi Jaiswal : చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్..  తొలి భారత క్రికెటర్ గా..

ఇంగ్లీష్ గడ్డపై ఆడిన తన తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.  మొత్తం ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్లు - మోత్గన్‌హల్లి జైసింహ, సునీల్ గవాస్కర్, జైస్వాల్ - ఆస్ట్రేలియాలో తమ తొలి టెస్టులోనే సెంచరీ సాధించారు.

New Update
Yashasvi-Jaiswal 1

లీడ్స్‌లోని హెడింగ్లీలో  ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ భారత్ తరపున ఓపెనర్‌గా దిగి సెంచరీ బాదాడు.   23 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ 101 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో ఇంగ్లీష్ గడ్డపై ఆడిన తన తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.  మొత్తం ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్లు - మోత్గన్‌హల్లి జైసింహ, సునీల్ గవాస్కర్, జైస్వాల్ - ఆస్ట్రేలియాలో తమ తొలి టెస్టులోనే సెంచరీ సాధించారు. ఇక ఆరుగురు బ్యాట్స్‌మెన్లు - విజయ్ మంజ్రేకర్, అబ్బాస్ అలీ బేగ్, సందీప్ పాటిల్, సౌరవ్ గంగూలీ, మురళీ విజయ్, జైస్వాల్ - ఇంగ్లీష్ గడ్డపై తమ తొలి టెస్టులోనే సెంచరీ సాధించారు. ఈ రెండు జాబితాలో  జైస్వాల్ ఉండటం విశేషం.  

ఇంగ్లాండ్‌లో తొలి టెస్ట్‌లో భారత్ తరఫున సెంచరీలు

146 – మురళీ విజయ్ (నాటింగ్‌హామ్, 2014)
133 – విజయ్ మంజ్రేకర్ (లీడ్స్, 1952)
131 – సౌరవ్ గంగూలీ (లార్డ్స్ 1996)
129* – సందీప్ పాటిల్ (మాంచెస్టర్, 1982)
112 – అబ్బాస్ అలీ బేగ్ (మాంచెస్టర్, 1959)
100* – యశస్వి జైస్వాల్ (లీడ్స్, 2025)

యశస్వి జైస్వాల్ కేవలం 129 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు, ఇందులో 16 బౌండరీలు, ఒక సిక్స్ కొట్టాడు. జైస్వాల్ తన ఇన్నింగ్స్ లో రెండు ముఖ్యమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు - మొదటి వికెట్ కు  కెఎల్ రాహుల్ తో కలిసి 91, కెప్టెన్ శుభ్ మాన్  గిల్ తో కలిసి నాల్గవ వికెట్ కు 129 పరుగులు జోడించాడు.  టీ బ్రేక్ తరువాత బెన్ స్టోక్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు