/rtv/media/media_files/2025/06/20/yashasvi-jaiswal-1-2025-06-20-21-11-14.jpg)
లీడ్స్లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్తో జరుగుతోన్న తొలి టెస్ట్లో యశస్వి జైస్వాల్ భారత్ తరపున ఓపెనర్గా దిగి సెంచరీ బాదాడు. 23 ఏళ్ల ఈ బ్యాట్స్మన్ 101 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో ఇంగ్లీష్ గడ్డపై ఆడిన తన తొలి టెస్ట్లో సెంచరీ సాధించిన తొలి భారతీయ క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు. మొత్తం ముగ్గురు భారత బ్యాట్స్మెన్లు - మోత్గన్హల్లి జైసింహ, సునీల్ గవాస్కర్, జైస్వాల్ - ఆస్ట్రేలియాలో తమ తొలి టెస్టులోనే సెంచరీ సాధించారు. ఇక ఆరుగురు బ్యాట్స్మెన్లు - విజయ్ మంజ్రేకర్, అబ్బాస్ అలీ బేగ్, సందీప్ పాటిల్, సౌరవ్ గంగూలీ, మురళీ విజయ్, జైస్వాల్ - ఇంగ్లీష్ గడ్డపై తమ తొలి టెస్టులోనే సెంచరీ సాధించారు. ఈ రెండు జాబితాలో జైస్వాల్ ఉండటం విశేషం.
West Indies. First Test. Hundred.
— Rajasthan Royals (@rajasthanroyals) June 20, 2025
Australia. First Test. Hundred.
England. First Test. HUNDRED! 💯🇮🇳 pic.twitter.com/jcEgKybB7N
ఇంగ్లాండ్లో తొలి టెస్ట్లో భారత్ తరఫున సెంచరీలు
146 – మురళీ విజయ్ (నాటింగ్హామ్, 2014)
133 – విజయ్ మంజ్రేకర్ (లీడ్స్, 1952)
131 – సౌరవ్ గంగూలీ (లార్డ్స్ 1996)
129* – సందీప్ పాటిల్ (మాంచెస్టర్, 1982)
112 – అబ్బాస్ అలీ బేగ్ (మాంచెస్టర్, 1959)
100* – యశస్వి జైస్వాల్ (లీడ్స్, 2025)
యశస్వి జైస్వాల్ కేవలం 129 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు, ఇందులో 16 బౌండరీలు, ఒక సిక్స్ కొట్టాడు. జైస్వాల్ తన ఇన్నింగ్స్ లో రెండు ముఖ్యమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు - మొదటి వికెట్ కు కెఎల్ రాహుల్ తో కలిసి 91, కెప్టెన్ శుభ్ మాన్ గిల్ తో కలిసి నాల్గవ వికెట్ కు 129 పరుగులు జోడించాడు. టీ బ్రేక్ తరువాత బెన్ స్టోక్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.