Jyothi: ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ లో తెలుగు అథ్లెట్ కు గోల్డ్

ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో ఉమెన్స్ 100 మీ హర్డిల్స్ లో తెలుగు అమ్మాయా జ్యోతి యర్రాజీకి గోల్డ్ మెడల్ వచ్చింది. 12.96 సెకన్లలో జ్యోతి లక్ష్యాన్ని చేరుకుని గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. 

New Update
asian

Jyothi Yarraji

కొరియాలో జరుగుతున్న ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో భారత్ కు మరో స్వర్ణం దక్కింది. 100 మీ హర్డిల్స్ లో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజీ గోల్డ్ మెడల్ సాధించారు. 12.96 సెకన్లలో జ్యోతి లక్ష్యాన్ని చేరుకుని గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.  దీంతో ఈ ఛాంపియన్ షిప్ లో భారత్ సాధించిన గోల్డ్ మెడల్స్ సంఖ్య నాలుగుకు చేరింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యోతికి అభినందనలు తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన జ్యోతి 2023 పోటీల్లో స్వర్ణం, 2024 లో 200 మీటర్ల పరుగులో రజతం గెలిచారు. జ్యోతికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డ్ ను కూడా ఇచ్చి సత్కరించింది. 

 

 

 today-latest-news-in-telugu | asian | athletics | world-championship

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు