/rtv/media/media_files/2025/06/21/gill-2025-06-21-06-29-10.jpg)
లీడ్స్లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్తో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ శుభ్మాన్ గిల్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో గిల్ తన ఖాతాలో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ గా ఆడిన తొలి ఇన్నింగ్స్ లోనే సెంచరీ బాదిన తొలి క్రికెటర్ గా నిలిచాడు. అంతకుముందు విజయ్ హజారే, సునీల్ గావస్కర్, విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించారు. గిల్ టెస్టు కెరీర్లో ఇది ఆరో సెంచరీ కావడం విశేషం. 1951లో ఢిల్లీలో ఇంగ్లాండ్పై 164 పరుగులు చేసి, కెప్టెన్సీ అరంగేట్రంలోనే సెంచరీ చేసిన రికార్డును హజారే కలిగి ఉన్నాడు. 2014లో అడిలైడ్లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కెప్టెన్గా కోహ్లీ తన తొలి మ్యాచ్లో రెండు సెంచరీలు సాధించాడు. మరోవైపు టెస్టులో గిల్ 2000 టెస్ట్ పరుగులు పూర్తి చేశాడు.
టెస్ట్ కెప్టెన్సీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన భారత బ్యాట్స్మెన్స్
విజయ్ హజారే - 164* vs ఇంగ్లాండ్ (ఢిల్లీ, 1951)
సునీల్ గవాస్కర్ - 116 vs న్యూజిలాండ్ (ఆక్లాండ్, 1976)
దిలీప్ వెంగ్సర్కార్ - 102 vs వెస్టిండీస్ (ఢిల్లీ, 1987)
విరాట్ కోహ్లీ - 115 మరియు 141 vs ఆస్ట్రేలియా (అడిలైడ్, 2014)
శుభ్మాన్ గిల్ - 100* vs ఇంగ్లాండ్ (లీడ్స్, 2025)
మరోవైపు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో అత్యధిక సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్లను కూడా శుభ్మాన్ గిల్ అధిగమించాడు.WTCలో భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ మాత్రమే . భారత మాజీ టెస్ట్ కెప్టెన్ పేరు మీద తొమ్మిది సెంచరీలు ఉన్నాయి.
రోహిత్ శర్మ 9
శుభ్మాన్ గిల్ 6
విరాట్ కోహ్లీ 5
యశస్వి జైస్వాల్ 5
మయాంక్ అగర్వాల్ 4
రిషబ్ పంత్ 4
Also Read : Yashasvi Jaiswal : చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్.. తొలి భారత క్రికెటర్ గా..