Sanju Samson : సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర.. దెబ్బకు కోహ్లీ రికార్డు బద్దలు!

అహ్మదాబాద్ వేదికగా జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచ కప్ ఒకే ఎడిషన్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న పాత రికార్డును సంజూ బద్దలు కొట్టాడు.

New Update
india (2)

అహ్మదాబాద్ వేదికగా జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచ కప్ ఒకే ఎడిషన్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న పాత రికార్డును సంజూ బద్దలు కొట్టాడు. 2014లో కోహ్లీ చేసిన 319 పరుగుల రికార్డును దాటి, సంజూ ఈ టోర్నీలో మొత్తం 321 పరుగులతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై అతను ఆడిన 46 బంతుల్లో 89 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఈ రికార్డు సాధించడంలో కీలకమైంది.

సంజూ సాధించిన ఈ ఘనతలో రెండు విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మొదటిది, అతను కేవలం ఐదు ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం. టోర్నీ మొదట్లో తుది జట్టులో లేని సంజూ, ఆ తర్వాత తనకు వచ్చిన అవకాశాలను అద్భుతంగా వాడుకున్నాడు. జింబాబ్వేపై 24, వెస్టిండీస్‌తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్‌లో 97*, సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై 89 పరుగులు చేసి టీమ్ ఇండియాను ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్‌లో కూడా అదే జోరును కొనసాగించి తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

రెండవ విశేషం ఏమిటంటే, సంజూ ఈ పరుగులు ఏకంగా 199.37 స్ట్రైక్ రేట్‌తో సాధించడం. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏ బ్యాటర్‌కూ ఇంతటి భారీ స్ట్రైక్ రేట్ లేదు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా ఈ రేసులో గట్టి పోటీ ఇచ్చి 317 పరుగులతో ఐదో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 383 పరుగులతో ఈ టోర్నీలో అందరికంటే ముందున్నప్పటికీ, భారత్ గెలవడంలో సంజూ ఆడిన ఈ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుంది.

Advertisment
తాజా కథనాలు