BIG BREAKING : ఆర్సీబీకి బిగ్ షాక్..  రూ. 12 కోట్ల ఆటగాడు ఔట్!

 ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. జట్టులో కీ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జోష్ హేజిల్‌వుడ్ ప్రస్తుతం ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కావడం విశేషం. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో హాజిల్‌వుడ్ 18 వికెట్లు పడగొట్టాడు.

New Update
rcb-12

ఐపీఎల్‌2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణిస్తోంది.ట్రోఫీని గెలుచుకునే బలమైన జట్లలో ఒకటిగా కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లోనే  ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. జట్టులో కీ బౌలర్ జోష్ హాజిల్‌వుడ్ భుజం గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.  34 ఏళ్ల ఈ పేసర్ ఇప్పటికే భుజం నొప్పితో బాధపడుతున్నాడు. మే 3న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు కూడా అతను దూరమయ్యాడు. ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం యల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోష్ హాజిల్‌వుడ్ ను రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది.  

 

ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు

జోష్ హేజిల్‌వుడ్ ప్రస్తుతం ఆర్సీబీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కావడం విశేషం. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో హాజిల్‌వుడ్ 18 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్  చేసే హాజిల్‌వుడ్ ..  ఈ సీజన్‌లో 100 డాట్ బాల్స్ బౌలింగ్ చేయడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించాడు.  హాజెల్‌వుడ్ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా తిరిగి అతన్ని ఐపీఎల్ కోసం భారత్ కు పంపించేందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. జూన్ మొదటి వారంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)  ఫైనల్ కూడా ఉండటం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకోవడంతో కమిన్స్, హెడ్ కూడా క్రికెట్ ఆస్ట్రేలియా ఇండియాకు తిరిగి పంపకపోవచ్చునని సమాచారం. 

Advertisment
Advertisment
తాజా కథనాలు