Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది.  15మందితో కూడిన జట్టుకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తారని వెల్లడించింది. ఆస్ట్రేలియా గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరుగుతాయి. వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
icc Australia

icc Australia Photograph: (icc Australia)

ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది.  15మందితో కూడిన జట్టుకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తారని వెల్లడించింది.   ఆస్ట్రేలియా గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరుగుతాయి, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్. దక్షిణాఫ్రికా జట్లతో లాహోర్, రావల్పిండి వేదికలో జరుగుతాయి. 

  • 22 ఫిబ్రవరి - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్
  • 25 ఫిబ్రవరి - ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, రావల్పిండి
  • 28 ఫిబ్రవరి - ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్, లాహోర్

Also Read :   మురికి వాడల పని ఇక అంతే..బీజేపీపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్

ఆస్ట్రేలియా జట్టు

పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషాగ్నే, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జాంపా

బుమ్రా కోసం ఆలస్యం 

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే పలుదేశాలు తమ జట్టులను ప్రకటించాయి.  కానీ భారత్ ఇంకా ప్రకటించలేదు. దాదాపుగా 4 నుంచి5 వారాల ముందే జట్టులను ప్రకటించాలి. బుమ్రా లాంటి ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతుండుతున్నారు. అతడు  ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడటం అనుమానంగానే అతడి విషయంలో క్లారిటీ రావడానికి మరింత టైమ్ పట్టే అవకాశం ఉంది.  దీంతో  ఛాంపియన్స్‌ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు మరింత టైమ్  కావాలని ఐసీసీని బీసీసీఐ కోరవచ్చని తెలుస్తోంది. ఒకసారి జట్టును ప్రకటించాక మార్పులు చేసుకోవడానికి అవకాశం లేకపోవడంతో బీసీసీఐ ఆచితూచి వ్యవహరిపస్తుంది.   మరి భారత సెలక్టర్లు ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.  

Also Read :   అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టేసింది!

Also Read :  IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. బీసీసీఐ అధికారిక ప్రకటన!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK VS RR: ప్లే ఆఫ్స్ కు వెళ్ళకపోయినా...విజయంతో ముగించిన రాజస్థాన్

రాజస్థాన్ రాయల్స్ తన చివరి మ్యాచ్ ను విజయంతో ముగించింది. ఈరోజు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. సీఎస్కే ఇచ్చిన 187 పరుగులు లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

New Update
ipl

CSK VS RR

ప్లే ఆఫ్స్ కు వెళ్లలేకపోయినా చివరి మ్యాచ్ లో విజయం సాధించి గౌరవాన్ని దక్కించుకుంది రాజస్థాన్ రాయల్. ఐపీఎల్ 18 సీజన్ లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది.  వైభవ్‌ సూర్యవంశీ  33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 పరుగులు,  కెప్టెన్ సంజు శాంసన్‌  31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ లతో 41 పరుగులు, యశస్వి జైస్వాల్‌  19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 పరుగులు చేసి రాణించారు. చివర్లో ధ్రువ్ జురెల్  12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31 పరుగులు, హెట్‌మయర్  5 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స తో 12 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించారు. చెన్నై బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ 2, అన్షుల్‌ కాంబోజ్‌, నూర్‌ అహ్మద్‌ ఒక్కో వికెట్‌ తీశారు. దీంతో చెన్నై పది మ్యాచ్ లు ఓడిపయింది. అయితే ఈ జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ ఆడడానికి మిగిలే ఉంది. 

టాస్ గెలిచిన ఆర్ఆర్..

ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.  దీంతో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ దిగింది.  నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.  చెన్నై ఆటగాళ్లలో ఆయుష్ మాత్రే(43), డెవాల్డ్ బ్రెవిస్ (42), శివం దుబే(39) పరుగులు చేశారు. డెవాన్ కాన్వే(10), ఉర్విల్ పటేల్(0), రవిచంద్రన్ అశ్విన్(13), ధోనీ(16)విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్, యుధ్వీర్ సింగ్ చరక్ చెరో మూడు వికెట్లు తీయగా..  తుషార్ దేశ్‌పాండే, వానిండు హసరంగా తలో వికెట్ తీశారు.  

 today-latest-news-in-telugu | IPL 2025 | csk vs RR | match | cricket

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు