Priyank Panchal : టీమిండియా తరుపున ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

టీమిండియా తరుపున ఆడకుండానే అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు ప్రియాంక్ పంచల్. 35 ఏళ్ల పంచల్ 127 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 45.18 సగటుతో 8,856 పరుగులు చేశాడు. పంచల్ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్ లో ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.  

New Update
priyank panchal

టీమిండియా తరుపున ఆడకుండానే అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు ప్రియాంక్ పంచల్. 35 ఏళ్ల పంచల్ 127 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడి, 45.18 సగటుతో 8,856 పరుగులు చేశాడు, ఇందులో 29 సెంచరీలు మరియు 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 35 ఏళ్ల ఈ గుజరాత్ బ్యాట్స్‌మన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కూడా కలిగి ఉన్నాడు. గుజరాత్, ఇండియా-ఎ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు ప్రియాంక్ పంచల్.  

చిరస్మరణీయమైన క్షణం

ప్రియాంక్ కెరీర్‌లో అత్యంత చిరస్మరణీయమైన క్షణం 2016–17 రంజీ ట్రోఫీ సీజన్, ఇందులో అతను 1310 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోరు 314తో  నాటౌట్‌గా నిలిచాడు. అదే సీజన్‌లో గుజరాత్ రంజీ ట్రోఫీ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. 2015–16లో విజయ్ హజారే ట్రోఫీని, 2012–13 మరియు 2013–14లో సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీని గెలుచుకున్న గుజరాత్ జట్లలో పంచల్ సభ్యుడిగా ఉన్నాడు.  ప్రియాంక్ 97 లిస్ట్ ఎ మ్యాచ్‌ల్లో 3672 పరుగులు చేశాడు. 

2023డిసెంబర్ లో తన చివరి లిస్ట్ ఎ మ్యాచ్ ఆడాడు. ప్రియాంక్ 59 టీ20ల్లో 1522 పరుగులు చేశాడు. 2021లో సౌతాఫ్రికా, 2022లో శ్రీలంకతో టెస్టులకు ఇండియా జట్టులో చోటు దక్కినా అతనికి తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. పంచల్ అంతర్జాతీయ స్థాయిలో, ఐపీఎల్ లో ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.  

Also read :  YS sharmila : వైఎస్సాఆర్ జిల్లా పేరు మార్పు..చంద్రబాబుకు షర్మిల సపోర్ట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు