/rtv/media/media_files/2025/05/26/tYwqwJf2mDexucd35lx3.jpg)
వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం సొమవారం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. పేరు మార్పుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. టీడీపీ నిర్వహించనున్న మహానాడులో మాజీ సీఎం వైఎస్సార్ పేరు పలకాల్సి వస్తుందని ఒక్కరోజు ముందు జిల్లా పేరునే మార్చేశారని షర్మిల అన్నారు. వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినప్పటికీ కడప జిల్లా చరిత్రను, సంప్రదాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు.
మహానాడు ముచ్చటలో YSR పేరే పలకాల్సి వస్తుందని ఒక్కరోజు ముందు ఏకంగా జిల్లా పేరునే మార్చేశారు. వ్యక్తిగతంగా ఇది బాధించే అంశమే అయినా.. కడప జిల్లా చరిత్రను, సంప్రదాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం YSR కడప జిల్లాగా పేరు మార్చడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. మహానేత మరణానంతరం కడప…
— YS Sharmila (@realyssharmila) May 26, 2025
రాజకీయాలు అజెండా కాదు అనుకుంటే
మహానేత మరణానంతరం కడప జిల్లాకు వైఎస్సార్ కడపగా పేరు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. అయితే కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్ పేరు మీద కక్ష్యపూరిత రాజకీయాలు అజెండా కాదు అనుకుంటే, పేర్లు మార్పు వెనుక మీకు దురుద్దేశ్యం లేకుంటే, సెంటిమెంట్ ప్రకారం పాత జిల్లా పేర్లు కొనసాగించాలని కోరిక ఉంటే, విజయవాడ నగరానికి ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు మార్చాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నామని అన్నారు.
వైఎస్సార్ , ఎన్టీఆర్ ఇద్దరు తెలుగు జాతి గర్వించే ఈ గడ్డ కన్న బిడ్డలేనని షర్మిల తెలిపారు. వారిద్దరూ ప్రజల గుండెల్లో ఎప్పటికి నిలిచిపోతారని తెలిపారు. ఒకరికి ఒకలా, మరొకరి మరోలా రాజకీయాలు ఆపాదించవద్దని సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నామని షర్మిల ట్వీట్ చేశారు.
Andhra Pradesh | kadapa | ys-sharmila | ap cm chandra babu naidu