/rtv/media/media_files/2025/05/02/1bH2Jw1JUqM4nP4K7O2z.jpg)
RR VS MI
ముంబయ్ ఇండియన్స్ చితక్కొట్టేసింది. రాజస్థాన్ మీద జరిగిన మ్యాచ్ లో విజృంభించేసింది. వరుసగా ఆరో విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. ఆర్ఆర్ ను వారి సొంత గ్రౌండ్ లోనే 100 పరుగులు తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయ్ ఇండియన్స్ 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 217 పరుగులు చేసింది. 218 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ అసలు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 16.1 ఓవర్లోనే కేవలం 117 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయిపోయింది. ముంబై బౌలర్లు ఆర్ఆర్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. జోఫ్రా ఆర్చర్ (30) టాప్ స్కోరర్. యశస్వి జైస్వాల్ (13), రియాన్ పరాగ్ (16), ధ్రువ్ జురెల్ (11), శుభమ్ దూబె (15), నితీష్ రాణా (9) పరుగులు మాత్రమే చేయగలిగారు. లాస్ట్ మ్యాచ్ లో సూపర్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ ఈసారి మాత్రం డకౌట్ గా వెనుదిరిగాడు. ముంబయి బౌలర్లలో కర్ణ్ శర్మ 3, ట్రెంట్ బౌల్ట్ 3, జస్ప్రీత్ బుమ్రా 2, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్య ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఛాన్స్ పోగొట్టుకుంది. మొత్తం 11 మ్యాచ్ లు ఆడి ఎనిమిదింటిలో ఓడిపోయింది.
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ VS ముంబై ఇండియన్స్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా మొదటి బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 218 టార్గెట్ ఉంది.
ఎవరెన్ని కొట్టారంటే?
ఓపెనర్లు రికెల్టన్ 38 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. అలాగే రోహిత్ శర్మ 36 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అందులో 9 ఫోర్లు ఉన్నాయి. అతడు కేవలం 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇక ఈ ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలతో మంచి శుభారంభం అందించారు. ఈ జోడీ తొలి వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అందులో 4 ఫోర్లు, 3 సిక్స్లు ఉన్నాయి. హార్దిక్ పాండ్య 23 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అందులో 6 ఫోర్లు, 1 సిక్స్తో దంచికొట్టారు. రాజస్థాన్ బౌలర్లలో రియాన్ పరాగ్, మహీశ్ తీక్షణ ఒక్కో వికెట్ పడగొట్టారు.
today-latest-news-in-telugu | IPL 2025