RR Vs MI: కుమ్మేశారు భయ్యా.. చుక్కలు చూపించిన నలుగురు బ్యాటర్లు - RR ముందు భారీ టార్గెట్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ VS ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు సాధించింది. ఆర్ఆర్ ముందు 218 టార్గెట్ ఉంది.

New Update
RR Vs MI

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ VS ముంబై ఇండియన్స్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా మొదటి బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. దీంతో ఆర్ఆర్ ముందు 218 టార్గెట్ ఉంది. 

Also Read: నమాజ్ చేయడానికి బస్సు ఆపిన డ్రైవర్.. బిగ్ షాకిచ్చిన ఆర్టీసీ! 

ఎవరెన్ని కొట్టారంటే?

ఓపెనర్లు రికెల్‌టన్ 38 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే రోహిత్ శర్మ 36 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అందులో 9 ఫోర్లు ఉన్నాయి. అతడు కేవలం 31 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇక ఈ ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలతో మంచి శుభారంభం అందించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 

Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు

ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 23 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. హార్దిక్ పాండ్య 23 బంతుల్లో 48 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అందులో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో దంచికొట్టారు. రాజస్థాన్ బౌలర్లలో రియాన్ పరాగ్, మహీశ్ తీక్షణ ఒక్కో వికెట్ పడగొట్టారు.

rr-vs-mi | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు