/rtv/media/media_files/2025/06/21/sunrisers-hyd-2025-06-21-13-10-51.jpg)
Kavya Maran: భారత్ లోనే అతిపెద్ద మీడియా సంస్ధల్లో ఒకటైన సన్ టీవీ నెట్వర్క్ యజమానులు మారన్ కుటుంబంలో ఆస్తి వివాదాలు రచ్చకెక్కాయి. కళానిధి మారన్కు ఆయన సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లీగల్ నోటీసులను పంపించారు. సన్ టీవీ టేకోవర్ సమయంలో తప్పుడు విధానాలు, తప్పుడు పాలనతో అక్రమాలకు పాల్పడినట్లు కళానిధి మారన్పై దయానిధి మారన్ ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా ళానిధి మారన్ మనీలాండరింగ్, ఇతర మోసపూరిత ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడ్డారని నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read: వెంటపడి ప్రేమ పెళ్లి చేసుకోని.. పిల్లలు కాకుండా టాబ్లెట్లు మింగించి!
మోసపూరితంగా చేజిక్కించుకున్నారని
తమ తండ్రి మరణం తరువాత సన్ టీవీ గ్రూప్ను మోసపూరితంగా చేజిక్కించుకున్నారని, ఆ సంస్థలో వాటాల పంపకాలను 2003 నాటి స్థితికి తీసుకురావాలని దయానిధి మారన్ నోటీసుల్లో డిమాండ్ చేశారు. తమ తండ్రి .వీలునామా రాయకుండానే చనిపోయారని, అందుకే 2003 నాటి ప్రకారం షేర్ల పంపకం జరగాలని దయానిధి మారన్ ఇప్పుడు కోరుతున్నారు. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO)తో సహా సెబీ, ఆర్బీఐ, ఈడీ, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలు ఈ విచారణలో పాల్గొనాలని తాను పంపించిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వివాదం మారన్ కుటుంబంలో అంతర్గత కలహాలను బహిర్గతం చేసిందని చెప్పాలి. దయానిధి ఆరోపణలను సన్ టీవీ నెట్వర్క్ ఖండించింది. సన్ టీవీ నెట్వర్క్ వాటాల పంపిణీ విషయంలో చట్టపరమైన నిబంధనలు పాటించామని స్పష్టం చేశారు. కోఆర్డినేటెడ్ పత్థిలో ఆర్థిక నేరాలకు తన సోదరుడు పాల్పడినట్లు దయానిధి మారన్ తన అఫిడవిట్లో తెలిపాడు. చీటింగ్, మనీ ల్యాండరింగ్కు కూడా పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read : ప్రతి టూ వీలర్ కు ఏబీఎస్..కేంద్రం సంచలన నిర్ణయం
వీళ్ల ఆస్తుల విషయానికి వచ్చేసరికి సన్నెట్ వర్క్ కంపెనీలో కళానిధి మారన్కు గానూ 75 శాతం వాటా ఉంది. ఇప్పుడు దీనికున్న మార్కెట్ విలువ రూ. 25 వేల కోట్లకు పైగానే ఉంటుంది. సన్ టీవీ నెట్వర్క్ లో తమిళం, తెలుగు, హిందీ, బెంగాలీ భాషలకు చెందిన ఛానెల్స్తో పాటు ఎఫ్ఎం రేడియో స్టేషన్లు ఉన్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఈ నెట్వర్క్లోకి కిందకే వస్తుంది. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్తో పాటు కావ్య మారన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంతర్గత కలహాల కారణంగా సన్టీవీ నెట్ వర్ష్ షేర్లు 4 శాతం పతనమయ్యాయి.