/rtv/media/media_files/2025/03/21/moQDj8RE7aZu1uv1LkOv.jpg)
England sack coach Lewis after Ashes humiliation
హెడ్ కోచ్ ఔట్
జాన్ లూయిస్ ఇంగ్లాండ్ మహిళా జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి తప్పుకున్నారు. యాషెస్ సిరీస్లో భారీ ఓటమి తర్వాత లూయిస్ హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగారు. ఫిబ్రవరిలో 16-0 తేడాతో ముగిసిన ఈ సిరీస్లో, ఇంగ్లాండ్ మహిళలు ఘోరంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒత్తిడి, విమర్శలకు గురయ్యారు.
ఇది కూడా చదవండి: AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
John Lewis
2021 నుండి ECB ఎలైట్ పేస్ బౌలింగ్ కోచ్గా పనిచేసిన తర్వాత.. లూయిస్ నవంబర్ 2022లో ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టారు. తన పదవీకాలంలో ఇంగ్లాండ్ ‘బైలాటిరల్ పోటీలలో’ బాగా రాణించింది. కానీ జట్టు ప్రపంచ టోర్నమెంట్లలో విజయం సాధించలేకపోయింది. మొత్తం మీద లూయిస్ హెడ్ కోచ్గా ఉన్న సమయంలో ఇంగ్లాండ్ ఆడిన 73 మ్యాచ్లలో 52 గెలిచింది.
ఇది కూడా చదవండి: AP News: SC వర్గీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం!
ఇంగ్లాండ్ మహిళల జట్టు మేనేజింగ్ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్లేర్ కానర్ దీనిపై స్పందించారు. లూయిస్ చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు. COVID-19 తర్వాత కఠినమైన కాలంలో ఆ బాధ్యతను స్వీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. అతడి పదవీకాలంలో ఇంగ్లాండ్ సాధించిన విజయాన్ని ఆయన గుర్తు చేశారు. అతడి పదవీకాలంలో జట్టు వరుసగా ఎనిమిది ODI సిరీస్ విజయాలను గెలవడానికి సహాయం చేసినందుకు లూయిస్కు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..
ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ICC మహిళల T20 ప్రపంచ కప్, మహిళల యాషెస్ నిరాశపరిచినప్పటికీ మనకు అందుబాటులో ఉన్న ప్రతిభ గురించి ఎలాంటి సందేహం లేదని ఆయన అన్నారు. త్వరలో మరొక వ్యక్తిని నియమించాలని చూస్తున్నాము అని తెలిపారు. మరోవైపు, ECB ఇప్పటికే మరో కోచ్ కోసం వెతకడం ప్రారంభించింది. ముఖ్యంగా ఈ సంవత్సరం చివర్లో జరిగే మహిళల ODI ప్రపంచ కప్, 2026లో జరిగే T20 ప్రపంచ కప్, యాషెస్లను దృష్టిలో ఉంచుకుని ప్రధాన హెడ్ కోచ్ కోసం చూస్తుంది.