ICC Women U-19: శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. వరుసగా మూడో విక్టరీ!

ఐసీసీ అండర్ 19 టీ20 మహిళల ప్రపంచ కప్‌లో భారత్ అదరగొట్టింది. నేడు జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 60 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. శ్రీలంక కేవలం 58 పరుగులకే ఆలౌట్ అయింది.

New Update
India Win Over Sri Lanka

India Win Over Sri Lanka

ICC Women U-19: భారత మహిళల క్రికెట్ జట్టు దూసుకుపోతోంది. పలు విజయాలతో అలుపెరగకుండా పరుగులు పెడుతోంది. ఇవాళ శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో దుమ్ము దులిపేసింది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు భారీ విజయం సాధించింది. నేడు జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది. 

Also Read :  Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ

వరుసగా మూడో విజయం

దాదాపు 60 పరుగుల తేడాతో మట్టుబెట్టింది. దీంతో ఈ టోర్నీలో భారత్ వరుసగా మూడో విజయాన్ని కైవసం చేసుకుంది. టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది. దీంతో భారత్ ఓడిపోతుందని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ బ్యాటింగ్‌లో రాణించని టీమిండియా బౌలింగ్‌లో అదరగొట్టేసింది. 

Also Read: Stock Market Today: లాభాల్లో  ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర

తెలుగు అమ్మాయి గొంగడి త్రిష 44 బంతుల్లో 49 పరుగులు చేసి త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. 5 ఫోర్లు, 1 సిక్స్‌తో వారెవ్వా అనిపించుకుంది. త్రిష మినహా మిగత బ్యాటర్లు పెద్దగా రన్స్ చేయలేకపోయారు. కెప్టెన్ నిక్కి ప్రసాద్ (11), మిథిలా వినోద్ (16), జోషిత (14)పరుగులు చేశారు. ఇక భవికా (7), కమలిని (5), ఆయుషి(5) రన్స్‌తో నిరాశపరిచారు. మొత్తంగా 118 పరుగులు చేశారు. 

Also Read: Maharashtra Train Accident: 12 మంది ప్రాణాలు తీసిన పుకారు.. రైలు ప్రమాదానికి ఇదే కారణం

ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక బ్యాటర్లు.. భారత బౌలర్ల ధాటికి కుప్పలిపోయారు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 58 పరుగులకే పరిమితమయ్యారు. ఇక శ్రీలంక జట్టులో ఒక్కరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఆరో స్థానంలో వచ్చిన రష్మిక సెవ్వండి మాత్రమే (15) పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతావాళ్లందరూ రెండు మూడు పరుగులకే కుప్పకూలిపోయారు. ఇక టీమిండియా బౌలర్లలో షబ్నమ్‌ 2, పరుణికా సిసోధియా 2, జోషిత 2, వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా ఒక్కో వికెట్ పడగొట్టారు.

Also Read :  GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!

Advertisment
Advertisment
తాజా కథనాలు