/rtv/media/media_files/2025/04/29/2GoO9YifUzWaroU5FuWh.jpg)
vaibhav suryavanshi bihar govt
ఐపీఎల్ లో కేవలం 35 బంతుల్లో సెంచరీ చేసిన తొలి అతి పిన్న వయస్కుడైన బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీకి నితీష్ ప్రభుత్వం రూ.10 లక్షలు నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్లోని సమస్తిపూర్ జిల్లా నివాసి వైభవ్ సూర్యవంశీకి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. భవిష్యత్లో వైభవ్ దేశం తరఫున ఆడి కొత్త రికార్డులు సృష్టించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. వైభవ్ సూర్యవంశీ సెంచరీ సాధించినందుకు బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి కూడా అభినందనలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆటగాళ్లకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటుందని తెలిపారు. బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా వైభవ్ సూర్యవంశీకి అభినందనలు తెలిపారు. వైభవ్ ను చూసి గర్విస్తున్నామని తేజస్వి యాదవ్ అన్నారు.
Bihar Chief Minister Nitish Kumar spoke on the phone to Vaibhav Suryavanshi, who scored a century in just 35 balls in IPL at the age of 14.
— The National Bulletin (@TheNationalBul1) April 29, 2025
Bihar government will give a reward of Rs 10 lakh to Vaibhav Suryavanshi#Bihar #NitishKumar #VaibhavSuryavanshi #ipl2025 #ipl pic.twitter.com/TWtEHpk0nI
35 బంతుల్లోనే 100 పరుగులు
కాగా నిన్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 14 ఏళ్ల వైభవ్ 35 బంతుల్లోనే 100 పరుగులు చేసిన విషయం తెలిసిందే. వైభవ్ 2011మార్చి 27 న బీహార్లోని సమస్తిపూర్ జిల్లా తాజ్పూర్లో జన్మించాడు. ఈ సంవత్సరం ఐపీఎల్లో ఆడిన అతి పిన్న వయస్కుడు అతను. 2024జనవరిలో కేవలం 12 సంవత్సరాల 284 రోజుల వయసులో బీహార్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.
Also Read : Pakistan Zindabad : పాకిస్థాన్ జిందాబాద్ అన్నాడని కొట్టి చంపేశారు!