/rtv/media/media_files/2025/05/30/xZmgboo9El1tChXjihMQ.jpg)
Virat Kohli Sledges Musheer Khan
Virat Kohli Sledges Musheer Khan: విరాట్ కోహ్లీ ఒకప్పుడు చాలా దుందుడుకు స్వభావి. ఇప్పుడు కూడా గోడవలకు వెళుతుంటారు కానీ ఎవరైనా తనను పోక్ చేస్తేనే వారితో తగువులు పడుతుంటాడు. మామూలుగా అయితే ఎవరి జోలికీ వెళ్ళడు. అయితే విరాట్ అందరినీ ఆట పట్టిస్తుంటాడు. దీన్ని అందరూ సరదాగా కూడా తీసుకుంటారు. కానీ నిన్నటి క్వాలిఫయర్ మ్యాచ్(IPL 2025 Qualifier Match) లో కోహ్లీ చేసిన ఒక పని మాత్రం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. పంజాబ్ యువ ఆటగాడిని విరాట్ స్లెడ్జింగ్(Virat Sledging Young Punjab Player) చేశాడంటూ సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. ఒక సీనియర్ ఆటగాడు అయి ఉండి ఇలా చేయడం ఏం బాలేదంటూ విమర్శిస్తున్నారు.
Also Read: కమల్ హాసన్కు బిగ్ షాక్.. ‘థగ్ లైఫ్’ మూవీ బ్యాన్..!
అసలేం జరిగిందంటే..
నిన్నటి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది. అప్పటికే ఆ జట్టు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. ఆ సమయంలో యువ ఆటగాడు ముషీర్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. అతడికి ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్. ముషీర్ క్రీజులోకి వచ్చిన సమయంలో స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ.. ముషీర్ ను స్లెడ్జింగ్ చేశాడు. యేతో పానీ పిలాతా హై అంటే ఇతను ఆటగాళ్లకు నీళ్లు అందిస్తాడు.. అంటూ ఎద్దేవా చేశాడు. అంతకు ముందే ముషీర్ మైదానంలో ప్లేయర్లకు నీళ్ళ బాటిళ్ళు అందించాడు. దాన్ని పట్టుకునే విరాట్ స్లెడ్జింగ్ చేశాడు. ఇది కాస్తా బ్యాటర్ వెనుక ఉన్న స్టంప్ మైకులో క్లియర్ గా రికార్డ్ అయింది. ఇది కాస్తా తరువాత సోషల్ మీడియాలో సోప్ట్ అయింది. దీంతో నెటిజన్లు కోహ్లీ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. సీనియర్ ఆటగాడు అయి ఉండి అతను ఇలా చేయడం...అతని స్థాయికి సరి కాదంటూ విమర్శిస్తున్నారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాల్సింది పోయి స్లెడ్జింగ్ చేయడం ఏంటి అని మండిపడుతున్నారు. మరో వైపు ముషీర్ 33 బంతులు ఆడినా ఒక్క పరుగూ చేయలేక, డకౌట్ గా వెనుదిరిగాడు.
Also Read: వివో మామ దించేశాడు భయ్యా.. రెండు కిర్రాక్ స్మార్ట్ఫోన్లు అదిరిపోయాయ్!
Virat Kohli saying "Ye to Paani pilata hai" to young Musheer Khan.
— Shana⁴⁵🐐 (@shana45__) May 30, 2025
What a shameless person he is still laughing even after saying. 😭😭 pic.twitter.com/usrMJ2NGiz
అయితే విరాట్ కోహ్లీ అభిమానులు మాత్రం అతనిని వెనకేసుకుని వస్తున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో విరాట్కోహ్లీ తన బ్యాట్ను ముషీర్ ఖాన్కు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ముషీర్ ఖాన్కు కూడా విరాట్ కోహ్లీ ఆరాధ్య క్రికెటర్ అని గుర్తు చేశారు. అందుకే అతనిని కోహ్లీ ఆటపట్టించాడని సమర్థిస్తున్నారు.
Also Read: హైదరాబాద్లో అమానుషం.. కారుపై గీత పడ్డందుకు ఖతం చేశాడు!
Also Read: Odisha: 1.5 టన్నుల పేలుడు పదార్ధాలను దొంగిలించిన నక్సల్స్..హై అలెర్ట్ లో పోలీసులు