Andhra Pradesh : ఏపీ అల్లర్లపై సిట్ బృందం విచారణ వేగవంతం..

ఏపీలో అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. తిరుపతి మహిళావర్సిటీ స్ట్రాంగ్ రూం దగ్గర జరిగిన ఘటనపై సిట్‌ బృందం అధికారులను విచారిస్తున్నారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదు స్వీకరిస్తున్నారు.

New Update
Andhra Pradesh : ఏపీ అల్లర్లపై సిట్ బృందం విచారణ వేగవంతం..

AP Violence : ఏపీ (Andhra Pradesh) లో అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. తిరుపతి మహిళావర్సిటీ (Tirupati Women's University) స్ట్రాంగ్ రూం దగ్గర జరిగిన ఘటనపై సిట్‌ బృందం అధికారులను విచారిస్తున్నారు. ఈ బృందంలోని డీఎస్పీ రవి మనోహరాచారి, ఇన్‌స్పెక్టర్ మురళీధర్‌లు ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు నమోదైన FIRలపై విచారణ చేస్తున్నారు.

Also Read: సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసే డేట్, ప్లేస్ ఇదే.. వైసీపీ సంచలన ప్రకటన!

ఈ నెల 14న వర్సిటీ స్ట్రాంగ్ రూం దగ్గర టీడీపీ (TDP) అభ్యర్థి నానిపై హత్యాయత్నం జరిగిన ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. తిరుపతి ఎస్పీతో పాటు నలుగురు అధికారులపై వేటు వేసింది. ఈ క్రమంలోనే హింసపై ఈసీ.. సిట్‌ను నియమించింది. రేపటికల్లా సిట్‌ తమ నివేదికను సమర్పించనుంది.

Also read: అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు

Advertisment
తాజా కథనాలు