Trains Cancelled: రెయిన్ ఎఫెక్ట్.. మరో 49 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే!

తెలుగు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరోసారి పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇందులో సోమవారం, మంగళవారం అలాగే బుధవారం నడిచే రైళ్లు కూడా ఉన్నాయి.

Trains Cancelled: రెయిన్ ఎఫెక్ట్.. మరో 49 రైళ్లు రద్దు.. లిస్ట్ ఇదే!
New Update

తెలుగు రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. రోడ్లు, బ్రిడ్జిలు కట్టుకుపోతున్నాయి. పలుచోట్ల రైల్వే ట్రాక్‌లు కూడా దెబ్బతిన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో నీటమునిగాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరోసారి పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నడిచే రైళ్లను రద్దు చేసింది. ఇందులో సోమవారం, మంగళవారం అలాగే బుధవారం నడిచే రైళ్లు కూడా ఉన్నాయి.

Also Read: ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు సేఫ్.. తెలంగాణ పోలీసుల కీలక ప్రకటన!

రద్దైన రైళ్లు ఇవే
సికింద్రాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233)
సిర్పూర్‌ కాగజ్‌నగర్‌-సికింద్రాబాద్‌ (17234)
విశాఖపట్నం – సికింద్రాబాద్‌ (12783)
విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (22203)
సికింద్రాబాద్‌-షాలిమార్‌ (12774)
షాలిమార్‌ – సికింద్రాబాద్‌ (12773)
సికింద్రాబాద్‌-విశాఖపట్నం (22204)
బెంగళూరు – హౌరా (12864)
కడప-విశాఖపట్నం (17487)
ఆదిలాబాద్‌-నాందేడ్‌ (17409)
నాందేడ్‌-ఆదిలాబాద్‌ (17410)
విశాఖపట్నం – సికింద్రాబాద్‌ (12805)
భువనేశ్వర్‌ – బెంగళూరు (18463)
విశాఖపట్నం-గుంటూరు (22701)
సికింద్రాబాద్‌-విశాఖపట్నం (20707)
విశాఖపట్నం – సికింద్రాబాద్‌ (20833)
సికింద్రాబాద్‌-విశాఖపట్నం (20834)

వీటితో పాటు మచిలీపట్నం – తిరుపతి, నర్సాపూర్‌-నగర్‌సోల్‌, బెంగళూరు-దానాపూర్‌, తిరుపతి-కాకినాడ రైలుతో పాటు మరికొన్ని రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అలాగే, మరో 13 రైళ్లు వేరే దారికి మళ్లించినట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి.. సహకరించాలని కోరింది.

#trains #trains-cancelled #heavy-rains #floods
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి