Beant Singh’s Son Contesting in Elections: భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య (Assassination of Indira Gandhi) చేసిన దోషి కుమారుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పంజాబ్లోని ఫరీద్కోట్ నియోజకవర్గం నుంచి సరబ్జిత్ సింగ్ ఖల్సా (45) స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. 1984లో ఇందిరాగాంధీని హత్య చేసిన హంతకుల్లో ఒకడైన బియాంత్ సింగ్ కొడుకే ఈ సరబ్జిత్ సింగ్ ఖల్సా (Sarabjit Singh Khalsa). అయితే ఈ ఎన్నికల ఆయనకు మొదటిసారి కాదు. గతంలో కూడా సరబ్జిత్ వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు. 2004లో బఠిండా స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. 2007లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భదౌర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
పూర్తిగా చదవండి..Indira Gandhi Assassination: లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ హంతకుడి కొడుకు పోటీ..
భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన బియాంత్ సింగ్ కొడుకు సరబ్జిత్ సింగ్ ఖల్సా(45) లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పంజాబ్లోని ఫరీద్కోట్ నియోజకవర్గం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు.
Translate this News: