Andhra Pradesh: విషాదం.. చెరువులో పడి అక్కాచెల్లెళ్ళు మృతి

అల్లూరి సీతారామారాజు జిల్లా అడ్డతీగల మండలం సోమన్నపాలెం గ్రామంలో ఇద్దరు అక్కాచెల్లెల్లు కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. మృతులు వంతల కావ్యశ్రీ (13), సాహితీ(10)గా పోలీసులు గుర్తించారు.

Andhra Pradesh: విషాదం.. చెరువులో పడి అక్కాచెల్లెళ్ళు మృతి
New Update

అల్లూరి సీతారామారాజు జిల్లా అడ్డతీగల మండలం సోమన్నపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కాలకృత్యాలకు వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెల్లు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని బయటకి తీశారు. మృతులు వంతల కావ్యశ్రీ (13), సాహితీ(10)గా గుర్తించారు. కూతుర్ల మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నాయి. దీంతో సోమన్నపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also Read: తెలంగాణ నిరుద్యోగులకు ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. ఇలా అప్లై చేసుకోండి!

#telugu-news #ap-news #drowning
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe