Singareni Elections : ఈ రోజు జరగనున్న సింగరేణి(Singareni) గుర్తింపు సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు ఓట్ల లిక్కింపు జరగనుంది. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లో 39, 748 కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు 700 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం లలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో జరగనున్న ఎన్నికలలో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. 1998 నుండి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలిసారి ఏఐ టియుసి(AITUC) విజయం సాధించింది. ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించగా మూడుసార్లు ఏఐటీయూసీ, రెండుసార్లు టీబీజీకేఎస్, ఒకసారి ఐ ఎన్ టి యు సి విజయం సాధించాయి.
పూర్తిగా చదవండి..Singareni : నేడు సింగరేణి ఎన్నికలు.. రాత్రికి ఫలితాలు
ఇవాళ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 39,748 సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Translate this News: