Telangana : ఎస్సై సెకండ్‌ సెటప్‌.. భార్య ఆందోళన

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఎస్సైగా పనిచేస్తు్న్న నాగరాజు భార్య మానస.. పీఎస్‌ ముందు ఆందోళనకు దిగారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధంలో ఉన్నాడని ఆరోపించారు. విడాకులు ఇవ్వాలంటూ నిత్యం తనను వేధిస్తున్నాడని వాపోయారు.

New Update
Telangana : ఎస్సై సెకండ్‌ సెటప్‌.. భార్య ఆందోళన

SI Second Setup : సిద్దిపేట జిల్లా (Siddipet District) కొమురవెల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎస్సైగా పనిచేస్తు్న్న నాగరాజు (Naga Raju) భార్య మానస (Manasa) .. పీఎస్‌ ముందు ఆందోళనకు దిగారు. తన భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం (Extramarital Affair) లో ఉన్నాడని ఆరోపించారు. అప్పటి నుంచి తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విడాకులు ఇవ్వాలంటూ నిత్యం వేధిస్తున్నాడని వాపోయారు. అతడి కుటుంబ సభ్యులు కూడా వేధిస్తున్నారని ఆరోపించారు.

Also read: మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

కరీంనగర్ జిల్లా గోపాల్‌పూర్‌కు చెందిన ఎస్సై నాగరాజుకు అదే గ్రామానికి చెందిన మానసకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఎస్సై వివాహేతర సంబంధం పెట్టుకుని.. తనకు విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నాడని భార్య ఆందోళన వ్యక్తం చేయడం కలకలం రేపుతోంది. ఎస్సై తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also read: తెలంగాణలో మారనున్న రేషన్ కార్డులు..

Advertisment
తాజా కథనాలు