చావనైనా చస్తాను గానీ.. ఆ పని మాత్రం చేయను: శివరాజ్ సింగ్ చౌహాన్ భావోద్వేగ వ్యాఖ్యలు

స్వప్రయోజనం కోసం అర్థించడం కన్నా మరణమే మేలన్నారు బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనంతరం తనను కలవడానికి వచ్చిన మహిళా కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

చావనైనా చస్తాను గానీ.. ఆ పని మాత్రం చేయను: శివరాజ్ సింగ్ చౌహాన్ భావోద్వేగ వ్యాఖ్యలు
New Update

Shivarajsingh Chowhan: స్వప్రయోజనం కోసం అర్థించడం కన్నా మరణమే మేలన్నారు బీజేపీ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనంతరం తనను కలవడానికి వచ్చిన మహిళా కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: తొలి విజయంతోనే సీఎం.. భజన్‎లాల్ కెరీర్‎లో ఆసక్తికర విశేషాలు

నాలుగుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ వ్యవహరించగా, అధిష్టానం ఈ సారి మోహన్ యాదవ్ కు ఆ భాగ్యం కలిగించింది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళవారం గవర్నర్ మంగూభాయ్‌ పటేల్‌ను కలిసి తన రాజీనామా సమర్పించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కొత్త ముఖ్యమంత్రి పూర్తి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

ఈ క్రమంలో ఆయన నివాసానికి వచ్చిన పలువురు మహిళా మద్దతుదారులు భావోద్వేగానికి లోనయ్యారు. సీఎంగా ఆయనే కొనసాగాలంటూ కోరగా, తన కోసం తాను ఏదీ కోరుకోనని, అది తన ప్రాణం పోయినా జరగదని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టంగా చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

#mohan-yadav #bjp #shivaraj-singh-chauhan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe