కేబినెట్ కీలక నిర్ణయం.. అక్కడ మద్యం అమ్మకాలు నిషేదం
మధ్య ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన ప్రదేశాల్లో మద్యంపై నిషేధం విధిస్తూ మధ్యప్రదేశ్ మంత్రివర్గం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. శ్రీరాముడు అడుగుపెట్టిన ప్రదేశంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్టు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు.