Team India : గుడ్‌ బై..గబ్బర్‌ షాకింగ్‌ నిర్ణయం

టీమిండియాకి ఊహించని షాక్‌ తగిలింది. క్రికెట్‌ నుంచి నిష్క్రమిస్తున్నట్లు టీమిండియా గబ్బర్‌ సింగ్‌ శిఖర్‌ ధావన్‌ ప్రకటించాడు. గత కొంత కాలంగా టీమిండియాలో ఆడేందుకు అవకాశం రాకపోవడంతో ధావన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

New Update
Team India :  గుడ్‌ బై..గబ్బర్‌ షాకింగ్‌ నిర్ణయం

Shikhar Dhawan Announces Retirement Of Cricket Team : టీమిండియా (Team India) క్రికెట్‌ జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. జట్టుకు ఓ స్టార్‌ ప్లేయర్‌ దూరం అవుతున్నట్లు ప్రకటించాడు. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan) అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీని గురించి సోషల్‌ మీడియా (Social Media) లో ఓ వీడియో పోస్ట్‌ చేశాడు.

ఇంటర్నేషనల్‌ , అలాగే డొమెస్టిక్‌ క్రికెట్‌ లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో ద్వారా శిఖర్‌ తెలిపాడు. భారత్‌ తరుఫున ఆడినందుకు చాలా గర్వంగా ఉందని..శిఖర్‌ వివరించాడు. తన ప్రయాణంలో తనకు ఎంతో మంది సాయం చేశారని…వారి వల్ల జీవితంలో ఆటలో ఈ స్థాయికి వచ్చానని వివరించారు.

అయితే టీమిండియాలో గత కొన్ని రోజులుగా శిఖర్ ధావన్ కు అవకాశం రాలేదు. దీంతో అసంతృప్తి చెందిన శిఖర్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు శిఖర్ కెరీర్ లో టీమిండియా తరఫున 34 టెస్టులు ఆడాడు. అలాగే టీ20 లు 68 ఆడాడు. వన్డే మ్యాచ్‌ లు 167 ఆడాడు.

Also Read:  కౌలాలంపూర్‌లో మురుగు కాల్వలో పడి కుప్పం మహిళ గల్లంతు!

Advertisment
తాజా కథనాలు