Shankar Mahadevan : ప్రముఖ సింగర్ శంకర్ మహదేవన్(Shankar Mahadevan) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవలే గ్రామీ అవార్డు(Gaami Award) ను గెలుచుకున్న మహదేవన్ నిన్న(మార్చి 9) ఇషా ఫౌండేషన్(Isha Foundation) లో జరిగిన మహాశివరాత్రి(Maha Shivaratri) వేడుకల సందర్భంగా ప్రదర్శన ఇచ్చారు. ఈ సమయంలో ఆయన బాలీవుడ్ పాటలను పాడారు. ఈ ప్రదర్శనపై ఒక వర్గం నుంచి విమర్శల వ్యక్తమవుతున్నాయి. మహదేవన్ పాటలకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతున్నాయి. ఓ వైపు శంకర్ పాటలను ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. అదే సమయంలో మహాశివరాత్రి సందర్భంగా బాలీవుడ్ పాటలపై ప్రదర్శన కొంతమందికి నచ్చలేదు. 12 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..Shankar Mahadevan : శివుడు ముందు అలాంటి పాటలు పాడుతావా? టాప్ సింగర్పై భక్తులు ఫైర్!
ఇటివలే గ్రామీ అవార్డు గెలుచుకున్న శంకర్ మహదేవన్ నిన్న ఇషా ఫౌండేషన్లో జరిగిన మహాశివరాత్రి వేడుకలో పాల్గొన్నారు. ఆయన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ పాటలను ప్రదర్శించినందుకు విమర్శలు వస్తున్నాయి. దేవుడు ముందు సినిమా పాటలు పాడుతారా అని కొందరు ట్వీట్లు చేస్తున్నారు.
Translate this News: