Telangana: ఆస్ట్రేలియాలో సముద్రం ఒడ్డున తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి..

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన అరటి అరవింద్ ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయిదు రోజుల క్రితం అతడు అదృశ్యమైన కాగా.. సిడ్నీ సముద్ర తీరాన మృతదేహం లభించింది. అయితే ఇది హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Telangana: ఆస్ట్రేలియాలో సముద్రం ఒడ్డున తెలుగు వ్యక్తి అనుమానాస్పద మృతి..
New Update

ఆస్ట్రేలియాలో దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన అరటి అరవింద్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అయిదు రోజుల క్రితం అదృశ్యమైనమైన అరవింద్.. సముద్రంలో శవమై తేలడం కలకలం రేపింది. సిడ్నీలోని సముద్ర తీరానికి కొద్ది దూరంలో పోలీసులు అరవింద్ కారును గుర్తించారు. లభించిన ఆధారాలతో మృతి చెందిన వ్యక్తిని అరవింద్‌గా గుర్తించారు.

Also Read: ఎట్టకేలకు జీవన్‌రెడ్డి రీఓపెన్..

ఉద్యోగం నిమిత్తం 12 ఏళ్ల క్రితం అరవింద్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థిరపడ్డాడు. అయితే అరవింద్‌ది హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 18 నెలల క్రితమే అతనికి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇటీవలే అరవింద్.. భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 6 రోజుల క్రితం అతని తల్లికి అక్కడి వాతావరణం పడకపోవడంతో ఇండియాకు తిరిగి వచ్చింది. దీంతో అక్కడే అరవింద్, భార్య సిరివెన్నెల కలిసి ఉంటున్నారు.

మరోవిషయం ఏంటంటే అరవింద్ భార్య ప్రస్తుతం గర్భవతి కావడంతో.. ఇండియాకు తిరిగి వచ్చేద్దామని అతడు భావించాడు.  ఇటీవలే తన కుటుంబ సభ్యులకు కారు వాష్‌ చేయించడం కోసం వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్లాడు. అప్పడి నుంచి అతని ఆచూకి కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా అరవింద్ అనుమానస్పద స్థితిలో మృతి చెందడాన్ని సిడ్నీ లోకల్ పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం..కారు బస్సు ఢీ…స్పాట్‌ లోనే ముగ్గురు మృతి

#ausralia #telugu-news #death #shadnagar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe