Train Accident: పట్టాలు తప్పిన మరో రైలు

పశ్చిమ బెంగాల్ మాల్దాలోని కతిహార్ డివిజన్‌లోని కుమేద్‌పూర్ యార్డ్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం వల్ల రెండు రైళ్లను రద్దు చేయగా.. 6 రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. 4 రైళ్లను షార్ట్ టర్మినేట్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Train Accident: పట్టాలు తప్పిన మరో రైలు
New Update

West Bengal: దేశంలో వరుస రైలు ప్రమాదాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఇప్పటికే రైల్వేబ్ శాఖపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో తాజాగా మరో రైలు ప్రమాదం సంభవించింది. పశ్చిమ బెంగాల్ మాల్దాలోని కతిహార్ డివిజన్‌లోని కుమేద్‌పూర్ యార్డ్‌లో గూడ్స్ రైలుకు చెందిన పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన నేపథ్యంలో రెండు రైళ్లను రద్దు చేయగా.. 6 రైళ్లను దారి మళ్లించారు రైల్వే శాఖ అధికారులు. 4 రైళ్లను షార్ట్ టర్మినేట్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ప్రభుత్వ ఉద్యోగం కోసం జావలిన్ పట్టి.. పట్టుదలతో ఒలింపిక్ కొట్టాడు..

#national-news #train-accident #west-bengal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe